Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:13 AM

ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం

ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం

ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర నేటి నుంచి అట్టహాసంగా ప్రారంభం
February 28, 2026 12:40 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అగ్నిగుండాలు – నంది వాహన సేవ ప్రత్యేక ఆకర్షణ

రాష్ట్రంలోనే అతిపెద్ద జాతరల్లో ఒకటిగా గుర్తింపు

కాకతీయ కాలం నుండి ప్రసిద్ధి గాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం జాతర నేటి నుండి అట్టహాసంగా ప్రారంభం కానుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన ఈ జాతర రాష్ట్రంలోనే నాలుగో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగే ఈ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

జాతర గణపతి పూజతో ప్రారంభమవుతుంది. రెండవ రోజు ధ్వజారోహణం, సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు నిర్వహించనున్నారు. మూడవ రోజు సంస్కృతిక కార్యక్రమాలతో పాటు గ్రామ పురోహితులు నారాయణ సూరి శర్మ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం వేద మంత్రాల నడుమ ఘనంగా జరుగుతుంది. కళ్యాణంలో పాల్గొనే దంపతులు తీర్థప్రసాదాలను ఇచ్చిపుచ్చుకుని స్వామివారి ఆశీర్వాదాలు పొందుతారు.


నాలుగవ రోజు అగ్నిగుండాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పురాతన ఆనవాయితీగా కొనసాగుతున్న అగ్నిగుండాలలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. నంది వాహన సేవలో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కోరికలు కోరుకుంటారు. భద్రకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం కూడా జరుగుతుంది.ఈ జాతర క్రీడలకు మారుపేరుగా నిలిచింది. కబడ్డీ, ఎడ్ల పందాలు, క్యారమ్స్, కోలాటం, చెస్ వంటి పోటీల్లో విజేతలకు బహుమతులు, నగదు ప్రదానం చేస్తారు. క్రీడాకారులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు దేవాలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్ తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు జాతరను ఆదివారం ఉదయం నాయకులతో కలిసి ప్రారంభించనున్నారు. గుట్ట పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.భక్తుల సౌకర్యార్థం మిర్యాలగూడ – భీమారం మార్గంలో ఐదు నిమిషాలకు ఒకసారి బస్సు సౌకర్యం కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాలయాలు మరింత సుందరంగా అభివృద్ధి చెందుతాయని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News