ఆమనగల్ మున్సిపాలిటీలో ఐదో వార్డు నుంచి (బిఆర్ఎస్) తరఫున విజయం సాధించిన కౌన్సిలర్ పాపిశెట్టి రాము అన్నను విద్యార్థి నాయకుడు చౌటి సతీష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై గళమెత్తి పోరాడుతున్న రాము అన్న సేవలు అభినందనీయమన్నారు. వార్డు అభివృద్ధి కోసం ఆయన కట్టుబాటుతో పనిచేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ వేద రజిని సాయి చంద్ సాయి, మిత్రమండలి అధ్యక్షులు, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అనుచరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి