Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:13 PM

అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు పంపిణీ
February 12, 2026 11:21 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

సమాజ సేవలో నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకొని నిరంతరం అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాదరణ పొందిన సంస్థ అక్షర కౌముది సేవా సంస్థ అని సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మీ అన్నారు.

గురువారం అక్షర కౌముది సామాజిక సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ పక్షాన ఈస్ట్ ఆనంద్ బాగ్ లో నిరుపేద కుటుంబాలు వారికి నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు దాతల సహకారంతో ఘనంగా నిర్వహించమని అధ్యక్షురాలు తెలిపారు, ఈ సందర్భంగా అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి సంస్థ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవ లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకంగా ఉందని అన్నారు, సంస్థ సాహిత్య , సాంస్కృతిక రంగంలో రాణిస్తూ బాల సాహిత్యం ను ప్రోత్సహిస్తూ వివిధ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తూ విద్యార్థుల ప్రతిభ ను వెలుగులోకి తీసుకొని రావడం లో సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.

ఈకార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా తులసి వెంకట రమణా చార్యులు సంస్థ ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి కోశాధికారి బచ్చల మాధవి , సంస్థ సభ్యులు సూర్యకుమారి , పావని, శ్రీహరి, రామచంద్రుడు ,అరుణ , శ్రీనివాస్ , రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News