Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:09 AM

అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు పంపిణీ
February 12, 2026 11:21 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

సమాజ సేవలో నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకొని నిరంతరం అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాదరణ పొందిన సంస్థ అక్షర కౌముది సేవా సంస్థ అని సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మీ అన్నారు.

గురువారం అక్షర కౌముది సామాజిక సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ పక్షాన ఈస్ట్ ఆనంద్ బాగ్ లో నిరుపేద కుటుంబాలు వారికి నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు దాతల సహకారంతో ఘనంగా నిర్వహించమని అధ్యక్షురాలు తెలిపారు, ఈ సందర్భంగా అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి సంస్థ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవ లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకంగా ఉందని అన్నారు, సంస్థ సాహిత్య , సాంస్కృతిక రంగంలో రాణిస్తూ బాల సాహిత్యం ను ప్రోత్సహిస్తూ వివిధ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తూ విద్యార్థుల ప్రతిభ ను వెలుగులోకి తీసుకొని రావడం లో సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.

ఈకార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా తులసి వెంకట రమణా చార్యులు సంస్థ ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి కోశాధికారి బచ్చల మాధవి , సంస్థ సభ్యులు సూర్యకుమారి , పావని, శ్రీహరి, రామచంద్రుడు ,అరుణ , శ్రీనివాస్ , రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News