అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
అక్షర కౌముది సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ
Prabhakar
సమాజ సేవలో నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకొని నిరంతరం అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాదరణ పొందిన సంస్థ అక్షర కౌముది సేవా సంస్థ అని సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మీ అన్నారు.
గురువారం అక్షర కౌముది సామాజిక సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ పక్షాన ఈస్ట్ ఆనంద్ బాగ్ లో నిరుపేద కుటుంబాలు వారికి నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు దాతల సహకారంతో ఘనంగా నిర్వహించమని అధ్యక్షురాలు తెలిపారు, ఈ సందర్భంగా అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి సంస్థ వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవ లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకంగా ఉందని అన్నారు, సంస్థ సాహిత్య , సాంస్కృతిక రంగంలో రాణిస్తూ బాల సాహిత్యం ను ప్రోత్సహిస్తూ వివిధ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తూ విద్యార్థుల ప్రతిభ ను వెలుగులోకి తీసుకొని రావడం లో సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
ఈకార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా తులసి వెంకట రమణా చార్యులు సంస్థ ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి కోశాధికారి బచ్చల మాధవి , సంస్థ సభ్యులు సూర్యకుమారి , పావని, శ్రీహరి, రామచంద్రుడు ,అరుణ , శ్రీనివాస్ , రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి