అక్రమ కేసులు, బెదిరింపులు సహించేదిలేదు: టైగర్ పురం సంతోష్ కుమార్
అక్రమ కేసులు, బెదిరింపులు సహించేదిలేదు: టైగర్ పురం సంతోష్ కుమార్
Komidala Mahender reddy
భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో వివిధ క్యాడర్లకు చెందిన న్యూస్ ఛానెల్స్ ఛైర్మన్లు, సీఈఓలు, ఎండీలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ రక్షణ చర్యలుగా గన్మెన్లను కేటాయించాలని పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ (POYNCA) అంతర్జాతీయ అధ్యక్షులు, అలాగే పీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్ “డిజిటల్ లైవ్ కేబుల్ న్యూస్ ఛానల్” ఛైర్మన్ టైగర్ పురం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా వివిధ రాష్ట్రాల్లో అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు కొందరు రాజకీయ పెద్దల అండతో చట్టవిరుద్ధ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలపై న్యూస్ కవరేజ్, స్టింగ్ ఆపరేషన్ల కోసం వెళ్లిన సీనియర్ జర్నలిస్టులు, ఛానెల్ యాజమాన్యాలపై దాడులు, హత్యాయత్నాలు, బెదిరింపులు, రౌడీయిజం, దాదాగిరి వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.
అదేవిధంగా కొందరు అక్రమ వ్యాపార దారులు అధికార పార్టీల నేతల సహకారంతో జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని, న్యూస్ కవరేజ్ నిలిపివేయకపోతే కుటుంబాలతో సహా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో మరిన్నిఅక్రమాలను వెలికితీయాలంటే జర్నలిస్టుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని పేర్కొంటూ, తక్షణమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు త్రేడ్ ఉన్న న్యూస్ ఛానెల్స్ యాజమాన్యాలకు గన్మెన్లను కేటాయించాలని టైగర్ పురం సంతోష్ కుమార్ ప్రభుత్వాలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి