Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:00 AM

అక్రమ కేసులు, బెదిరింపులు సహించేదిలేదు: టైగర్ పురం సంతోష్ కుమార్

అక్రమ కేసులు, బెదిరింపులు సహించేదిలేదు: టైగర్ పురం సంతోష్ కుమార్

అక్రమ కేసులు, బెదిరింపులు సహించేదిలేదు: టైగర్ పురం సంతోష్ కుమార్
May 23, 2026 05:33 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో వివిధ క్యాడర్‌లకు చెందిన న్యూస్ ఛానెల్స్ ఛైర్మన్‌లు, సీఈఓలు, ఎండీలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ రక్షణ చర్యలుగా గన్‌మెన్లను కేటాయించాలని పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ (POYNCA) అంతర్జాతీయ అధ్యక్షులు, అలాగే పీవీసీ న్యూస్ దమ్మున్న ఛానల్ “డిజిటల్ లైవ్ కేబుల్ న్యూస్ ఛానల్” ఛైర్మన్ టైగర్ పురం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా వివిధ రాష్ట్రాల్లో అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు కొందరు రాజకీయ పెద్దల అండతో చట్టవిరుద్ధ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలపై న్యూస్ కవరేజ్, స్టింగ్ ఆపరేషన్ల కోసం వెళ్లిన సీనియర్ జర్నలిస్టులు, ఛానెల్ యాజమాన్యాలపై దాడులు, హత్యాయత్నాలు, బెదిరింపులు, రౌడీయిజం, దాదాగిరి వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.

అదేవిధంగా కొందరు అక్రమ వ్యాపార దారులు అధికార పార్టీల నేతల సహకారంతో జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని, న్యూస్ కవరేజ్ నిలిపివేయకపోతే కుటుంబాలతో సహా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి పరిస్థితుల్లో మరిన్నిఅక్రమాలను వెలికితీయాలంటే జర్నలిస్టుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని పేర్కొంటూ, తక్షణమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు త్రేడ్ ఉన్న న్యూస్ ఛానెల్స్ యాజమాన్యాలకు గన్‌మెన్లను కేటాయించాలని టైగర్ పురం సంతోష్ కుమార్ ప్రభుత్వాలను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News