Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 19, 2026 05:43 PM

అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు.. మిస్సింగ్ కేసులో బయటపడ్డ అసలు నిజం!

అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు.. మిస్సింగ్ కేసులో బయటపడ్డ అసలు నిజం!

అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు.. మిస్సింగ్ కేసులో బయటపడ్డ అసలు నిజం!
March 19, 2026 03:53 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

అబ్దుల్లాపూర్‌మెట్ : నమ్మిన బంధమే కాలయముడైంది. తోడబుట్టిన అక్క అని చూడకుండా ఓ తమ్ముడు అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం అక్కను హతమార్చి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెరువులో పడేసిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారంలో కలకలం రేపింది.

అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన లీలా దేవి (40), ఆమె తమ్ముడు పప్పు రామ్ కుమావత్ బాటసింగారంలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కలిసి గ్రామంలో 120 గజాల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అయితే, ఆ ప్లాట్ తమ్ముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. గత కొంతకాలంగా లీలా దేవి తన వాటా కోసం తమ్ముడిని అడుగుతోంది. దీనికి నిరాకరించిన పప్పు రామ్, అక్కను వదిలించుకోవాలని పథకం వేశాడు.

హత్య మరియు మాయాజాలం:

ఫిబ్రవరి 28న ఇంట్లోనే లీలా దేవిని హత్య చేసిన నిందితుడు, మార్చి 2న మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి కార్లో తీసుకెళ్లి మజీద్‌పూర్ చెరువులో పడేశాడు. ఏమీ తెలియనట్లుగా, తన అక్క కిరాణా షాపుకు వెళ్లి కనిపించకుండా పోయిందని ఫిబ్రవరి 28న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల విచారణలో నిజం నిప్పులా..

మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, పప్పు రామ్ ప్రవర్తనపై అనుమానంతో గట్టిగా విచారించగా అసలు విషయం బయటపడింది. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తేలింది. ఈ కేసులో పప్పు రామ్‌తో పాటు అతనికి సహకరించిన రాకేష్ కుమావత్, సునీల్ కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News