ఐటీ టవర్లో ‘ఏఐ.ప్రొఫ్’ కెరీర్ గైడెన్స్కు విశేష స్పందన!
ఐటీ టవర్లో ‘ఏఐ.ప్రొఫ్’ కెరీర్ గైడెన్స్కు విశేష స్పందన!
NM Yadav
గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానే లక్ష్యం..
జేఎన్టీయూ భాగస్వామ్యంతో సరికొత్త ఏఐ బీటెక్ ఎకోసిస్టమ్..
సందేహాలు నివృత్తి చేసుకున్న ఇంటర్ విద్యార్థులు తల్లిదండ్రులు..
నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని ఐటీ టవర్లో ఆదివారం నిర్వహించిన ఇంజనీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్, గైడెన్స్ సదస్సుకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ‘ఏఐ.ప్రొఫ్’ (AI.Prof) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నల్లగొండ పరిసర ప్రాంతాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు భారీగా తరలివచ్చారు. తమ భవిష్యత్తు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు ఉన్న పలు సందేహాలను నిపుణులు ఈ సందర్భంగా నివృత్తి చేశారు.
రూ.లక్షలు వెచ్చిస్తున్నా దక్కని ఉపాధి.. ఏఐతోనే మేలు..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘ఏఐ.ప్రొఫ్’ సంస్థ ప్రతినిధి పైళ్ల సాయిచరణ్ రెడ్డి మాట్లాడారు. రూ.లక్షలు వెచ్చించి, నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి బీటెక్ పూర్తి చేస్తున్నప్పటికీ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సరైన ఉపాధి అవకాశాలు లభించక ఎంతోమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ప్రభంజనం విపరీతంగా ఉండబోతోందని, ఈ క్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఏఐ ఆధారిత బీటెక్ ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
సొంత గడ్డపై మమకారంతోనే..
నల్లగొండ స్థానికుడైన సాందీప్ కోణం తన సొంత నేలపై మమకారంతో, గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే సంకల్పంతోనే ఈ ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రతినిధులు వివరించారు.
దేశంలోనే ప్రప్రథమంగా సరికొత్త విద్యా విధానం..
‘ఏఐ.ప్రొఫ్’ అనేది విద్యార్థుల భవిష్యత్తును సురక్షితం చేసే ఒక సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బీటెక్ ఎడ్యుకేషన్ ఇకోసిస్టమ్ అని సాయిచరణ్ రెడ్డి తెలిపారు. ప్రఖ్యాత కార్నెగీ మెలన్ యూనివర్సిటీ విద్యా ప్రమాణాల స్పూర్తితో, హైదరాబాద్ జేఎన్టీయూ (JNTUH) భాగస్వామ్యంతో తెలంగాణలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభమైందని వివరించారు. దేశంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ ‘ఏఐ ఆధారిత బీటెక్ ఎకోసిస్టమ్’ సేవలను విద్యార్థులు వినియోగించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని భరోసా ఇచ్చారు. విద్యార్థుల ఆశలను నిజం చేస్తూ, వారి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ‘ఏఐ.ప్రొఫ్’ ఒక దిక్సూచిలా పనిచేస్తుందని, విద్యార్థులను విజయం వైపు నడిపిస్తుందని పేర్కొన్నారు.
ముగిసిన సదస్సు.. ప్రతినిధుల హాజరు..
ఈ సదస్సులో విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిపుణులు సరైన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ‘ఏఐ.ప్రొఫ్’ ప్రతినిధులు అజ్మీర భాను ప్రకాష్, మనీష్లతో పాటు కోణం ఫౌండేషన్ ప్రతినిధులు స్నేత, నవ్య, శ్రీనివాస్, అంజి, పరశురామ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి