ఐలు గెలుపు… న్యాయవాదుల్లో నూతన ఆశలు. సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ
ఐలు గెలుపు… న్యాయవాదుల్లో నూతన ఆశలు. సంక్షేమానికి కట్టుబడి ఉంటామని హామీ
Editor Desk
బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఐలు అభ్యర్థులు యం. శ్రీనివాసరావు, సిహెచ్ శైలజ గెలుపును పురస్కరించుకొని రామన్నపేట బార్ అసోసియేషన్లో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, బార్ కౌన్సిల్లో పేరుకుపోయిన న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు గెలుపొందిన అభ్యర్థులు కృషి చేస్తారని అన్నారు. న్యాయవాదులతో కలిసి సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
న్యాయవాదులకు ఆరోగ్య భీమా, మరణానంతర లబ్ధులు కల్పించడం, జూనియర్ అడ్వకేట్లకు రూ.10,000 స్టైఫండ్ ఇవ్వడం, మహిళా న్యాయవాదులకు ప్రత్యేక బార్ అసోసియేషన్లు ఏర్పాటు చేయడం, మెటర్నిటీ బెనిఫిట్స్ అందించడం వంటి అంశాలపై కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, పాల్వంచ జగ్గయ్య, ఉయ్యాల హనుమంతు గౌడ్, కెమె రామదాసు, బాతరాజు అశోక్ కుమార్, డేవిడ్, దినేష్ కుమార్, నోముల స్వామి, సతీష్ రెడ్డి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి