ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు – రజక సంఘం నేతల ఆవేదన
ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు – రజక సంఘం నేతల ఆవేదన
chintha ravi
తిరుమలగిరి స్థానికం ప్రతినిధి రవి
తిరుమలగిరి మండల కేంద్రంలోని ధోబీఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటును కొందరు అడ్డుకుంటున్నారని రజక సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు సోమన్న మాట్లాడుతూ…
గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తరతరాలుగా రజకులు తమ కులవృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే స్థలాన్ని పట్టా భూమి అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని, ఇది రజక సమాజ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని సంఘం నేతలు పేర్కొన్నారు. తమ సంప్రదాయాలు, హక్కులను కాలరాస్తూ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం అన్యాయమని వారు అన్నారు.
ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి, సమస్యను పరిశీలించి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు రజకులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో
రజక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి