Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:36 AM

ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు – రజక సంఘం నేతల ఆవేదన

ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు – రజక సంఘం నేతల ఆవేదన

ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు – రజక సంఘం నేతల ఆవేదన
04-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Tirumalagiri
chintha ravi

తిరుమలగిరి స్థానికం ప్రతినిధి రవి

తిరుమలగిరి మండల కేంద్రంలోని ధోబీఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటును కొందరు అడ్డుకుంటున్నారని రజక సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు సోమన్న మాట్లాడుతూ…

గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తరతరాలుగా రజకులు తమ కులవృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే స్థలాన్ని పట్టా భూమి అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని, ఇది రజక సమాజ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని సంఘం నేతలు పేర్కొన్నారు. తమ సంప్రదాయాలు, హక్కులను కాలరాస్తూ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం అన్యాయమని వారు అన్నారు.

ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి, సమస్యను పరిశీలించి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు రజకులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో

రజక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐలమ్మ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారు – రజక సంఘం నేతల ఆవేదన

Article Image

తిరుమలగిరి స్థానికం ప్రతినిధి రవి

తిరుమలగిరి మండల కేంద్రంలోని ధోబీఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటును కొందరు అడ్డుకుంటున్నారని రజక సంఘం నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు సోమన్న మాట్లాడుతూ…

గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తరతరాలుగా రజకులు తమ కులవృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే స్థలాన్ని పట్టా భూమి అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని, ఇది రజక సమాజ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని సంఘం నేతలు పేర్కొన్నారు. తమ సంప్రదాయాలు, హక్కులను కాలరాస్తూ విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం అన్యాయమని వారు అన్నారు.

ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి, సమస్యను పరిశీలించి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు రజకులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో

రజక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News