ఐకేపీ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఐకేపీ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
Biksham
వల్లభపురంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సూర్యాపేట: చివ్వేంల మండలంలోని వల్లభపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకోవడం వల్ల రైతులకు నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
వల్లభపురం పరిసర గ్రామాల రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సమయానికి ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతులు తమ వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి తీసుకురావాలని సూచించారు.వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మాజీ సర్పంచ్ మొగదాల లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు బానోతు వెంకటి, పట్టణ పార్టీ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, ఎస్సి విభాగం ఉపాధ్యక్షుడు చింతమళ్ల రమేష్, జిల్లా వాణిజ్య విభాగం చైర్మన్ కక్కిరెని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, ఓబీసీ విభాగం అధ్యక్షుడు రావుల రాంబాబు, సేవాదళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, డీసీసీ కార్యదర్శి వెన్న మధుకర్ రెడ్డి, నాయకులు చెంచల నిఖిల్, నారాయణ ప్రవీణ్ రెడ్డి, నాగు నాయక్, మద్దెబోయిన శ్రీనివాస్, వాజిద్ మియా, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి