Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:26 PM

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
April 18, 2026 05:23 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులు దళారులను నమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట మండలంలోని హనుమనాయక్ తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సరైన ధర పొందాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

ధాన్యంలో తేమ శాతం 17 శాతం మించకుండా ఉండాలని, పంటను బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధారావత్ మణికుమార్, ఉప సర్పంచ్ కల్పన సుగ్రీ, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, మాజీ సర్పంచ్ రామసాని రమేష్, వార్డ్ సభ్యులు సత్యమ్మ, విజయ, మధు, నాగేష్, లింగా రాజు, కౌసల్య, నాగేశ్వరరావు, స్వయంసహాయక సంఘ సభ్యులు డి. కైక, డి. పద్మ, డి. కల్పన, డి. విజయ, డి. సైదమ్మ తదితరులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News