Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:47 AM

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
18-04-2026 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులు దళారులను నమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట మండలంలోని హనుమనాయక్ తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సరైన ధర పొందాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

ధాన్యంలో తేమ శాతం 17 శాతం మించకుండా ఉండాలని, పంటను బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధారావత్ మణికుమార్, ఉప సర్పంచ్ కల్పన సుగ్రీ, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, మాజీ సర్పంచ్ రామసాని రమేష్, వార్డ్ సభ్యులు సత్యమ్మ, విజయ, మధు, నాగేష్, లింగా రాజు, కౌసల్య, నాగేశ్వరరావు, స్వయంసహాయక సంఘ సభ్యులు డి. కైక, డి. పద్మ, డి. కల్పన, డి. విజయ, డి. సైదమ్మ తదితరులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Article Image

రైతులు దళారులను నమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట మండలంలోని హనుమనాయక్ తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సరైన ధర పొందాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

ధాన్యంలో తేమ శాతం 17 శాతం మించకుండా ఉండాలని, పంటను బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధారావత్ మణికుమార్, ఉప సర్పంచ్ కల్పన సుగ్రీ, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, మాజీ సర్పంచ్ రామసాని రమేష్, వార్డ్ సభ్యులు సత్యమ్మ, విజయ, మధు, నాగేష్, లింగా రాజు, కౌసల్య, నాగేశ్వరరావు, స్వయంసహాయక సంఘ సభ్యులు డి. కైక, డి. పద్మ, డి. కల్పన, డి. విజయ, డి. సైదమ్మ తదితరులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News