ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
Biksham
రైతులు దళారులను నమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట మండలంలోని హనుమనాయక్ తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సరైన ధర పొందాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.
ధాన్యంలో తేమ శాతం 17 శాతం మించకుండా ఉండాలని, పంటను బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా శుభ్రంగా తీసుకురావాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధారావత్ మణికుమార్, ఉప సర్పంచ్ కల్పన సుగ్రీ, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, మాజీ సర్పంచ్ రామసాని రమేష్, వార్డ్ సభ్యులు సత్యమ్మ, విజయ, మధు, నాగేష్, లింగా రాజు, కౌసల్య, నాగేశ్వరరావు, స్వయంసహాయక సంఘ సభ్యులు డి. కైక, డి. పద్మ, డి. కల్పన, డి. విజయ, డి. సైదమ్మ తదితరులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి