ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
Biksham
ఆత్మకూర్(ఎస్) మండలంలోని దాచారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం పదిహేడు శాతం మించకుండా ఉండేలా, బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా శుభ్రంగా ఉంచాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగరబోయిన ఎల్లమ్మ, ఉప సర్పంచ్ శ్రీలత, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, మాజీ సర్పంచ్ శంకర్, గ్రామ పెద్దలు గూడుపూరి శ్రీను, నోముల వెంకన్న, మాలే వెంకట్ రెడ్డి, కట్కూరి వెంకట్ రెడ్డి, కట్కూరి రామ్ రెడ్డి, వార్డు సభ్యులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి