Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 02:27 PM

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
April 15, 2026 04:31 PM 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆత్మకూర్(ఎస్) మండలంలోని దాచారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం పదిహేడు శాతం మించకుండా ఉండేలా, బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా శుభ్రంగా ఉంచాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగరబోయిన ఎల్లమ్మ, ఉప సర్పంచ్ శ్రీలత, మార్కెట్ డైరెక్టర్ అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, మాజీ సర్పంచ్ శంకర్, గ్రామ పెద్దలు గూడుపూరి శ్రీను, నోముల వెంకన్న, మాలే వెంకట్ రెడ్డి, కట్కూరి వెంకట్ రెడ్డి, కట్కూరి రామ్ రెడ్డి, వార్డు సభ్యులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News