ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు
ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు
Biksham
137 వార్డుల ఫలితాల కోసం ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్
సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 137 వార్డుల ఓట్ల లెక్కింపు ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు రెండో అంతస్తులోని 425, 525, 627 గదులను కేటాయించారు.
కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉండగా, అందులో 3 వార్డులు ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి. మిగిలిన 32 వార్డుల ఓట్ల లెక్కింపును రెండో అంతస్తులోని 321, 327, 328 గదుల్లో నిర్వహించనున్నారు.
హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 27 వార్డుల లెక్కింపు మొదటి అంతస్తులోని 511, 512, 513 గదుల్లో జరుగుతుంది.
నేరేడు చర్ల మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపును మొదటి అంతస్తులోని 616, 612 గదుల్లో నిర్వహించనున్నారు.
తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపుకు మొదటి అంతస్తులోని 316, 317 గదులను కేటాయించారు.
లెక్కింపు కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు, ప్రతినిధులు నిబంధనలు పాటించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి