Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:57 PM

ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు

ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు

ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు
12-02-2026 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

137 వార్డుల ఫలితాల కోసం ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 137 వార్డుల ఓట్ల లెక్కింపు ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు రెండో అంతస్తులోని 425, 525, 627 గదులను కేటాయించారు.

కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉండగా, అందులో 3 వార్డులు ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి. మిగిలిన 32 వార్డుల ఓట్ల లెక్కింపును రెండో అంతస్తులోని 321, 327, 328 గదుల్లో నిర్వహించనున్నారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 27 వార్డుల లెక్కింపు మొదటి అంతస్తులోని 511, 512, 513 గదుల్లో జరుగుతుంది.

నేరేడు చర్ల మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపును మొదటి అంతస్తులోని 616, 612 గదుల్లో నిర్వహించనున్నారు.

తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపుకు మొదటి అంతస్తులోని 316, 317 గదులను కేటాయించారు.

లెక్కింపు కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు, ప్రతినిధులు నిబంధనలు పాటించాలని సూచించారు.

Sthanikam

ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు

Article Image

137 వార్డుల ఫలితాల కోసం ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 137 వార్డుల ఓట్ల లెక్కింపు ఎస్ వి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు రెండో అంతస్తులోని 425, 525, 627 గదులను కేటాయించారు.

కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉండగా, అందులో 3 వార్డులు ఏకగ్రీవంగా నిర్ణయించబడ్డాయి. మిగిలిన 32 వార్డుల ఓట్ల లెక్కింపును రెండో అంతస్తులోని 321, 327, 328 గదుల్లో నిర్వహించనున్నారు.

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా, ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 27 వార్డుల లెక్కింపు మొదటి అంతస్తులోని 511, 512, 513 గదుల్లో జరుగుతుంది.

నేరేడు చర్ల మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపును మొదటి అంతస్తులోని 616, 612 గదుల్లో నిర్వహించనున్నారు.

తిరుమలగిరి మున్సిపాలిటీలో 15 వార్డుల ఓట్ల లెక్కింపుకు మొదటి అంతస్తులోని 316, 317 గదులను కేటాయించారు.

లెక్కింపు కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు, ప్రతినిధులు నిబంధనలు పాటించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News