Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆహార నాణ్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలి: కలెక్టర్ చంద్రశేఖర్ గ్రామాల్లో శుభ్రత పాటించండి – ప్రజల ఆరోగ్యం ముఖ్యం: ఎంపీడీఓ వెంకటలక్ష్మి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌కే మల్లికార్జున నియామకం రాయికోడ్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర ప్రారంభం జురెల్ జుంఝుమారుతం.. గుజరాత్ కోటలో రాయల్స్ జైత్రయాత్ర! “అడవిని కాపాడే ‘అమ్మ’: జార్ఖండ్ ‘లేడీ టార్జాన్’ చామీ ముర్ము 30 లక్షల చెట్ల గాథ” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” సింగరేణి గనిలో దళిత కార్మికులపై అమానుషిక వివక్ష: వెయిటింగ్ రూమ్‌లో భోజనానికి అడ్డుకున్న అధికారులు! ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 06, 2026 09:37 PM

ఆహార భద్రతపై ప్రజల్లో చైతన్యం అవసరం – కలెక్టర్ ప్రావీణ్య

ఆహార భద్రతపై ప్రజల్లో చైతన్యం అవసరం – కలెక్టర్ ప్రావీణ్య

ఆహార భద్రతపై ప్రజల్లో చైతన్యం అవసరం – కలెక్టర్ ప్రావీణ్య
April 06, 2026 07:27 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆహార భద్రత అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత ప్రమాణాలు, ఎక్స్పైరీ తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో సోమవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా ఆహార పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, లైసెన్స్ మేళా, ఫుడ్ స్టాళ్లు నిర్వహించి, ఆహారంలో కల్తీలపై లైవ్ డెమోన్స్ట్రేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా “పండ్లను కృత్రిమంగా పక్వం చేయుటకు సరైన మార్గం” అనే పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి వారికి సర్టిఫికెట్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఆహార వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సులు పొందుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, ప్రజలు కల్తీ ఆహారం బారినపడకుండా కొనుగోలు ముందు నాణ్యత, గడువు తేదీలను పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా కల్తీ ఆహారం గుర్తించినట్లయితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6 నుండి 11 వరకు “ఆరోగ్య వారోత్సవం” నిర్వహిస్తున్నదని, ప్రజలు ఇందులో పాల్గొని అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఫిర్యాదుల కోసం 9908978790, 9985600602 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమా హారతి, ఆర్డీవో రాజేందర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు అమృత, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News