అంగన్వాడీ కేంద్రానికి మెటీరియల్ అందజేసిన యువ నాయకుడు జూకంటి మధు
అంగన్వాడీ కేంద్రానికి మెటీరియల్ అందజేసిన యువ నాయకుడు జూకంటి మధు
Sthanikam District Staff Reporter
స్థానికం:మోటకొండూరు మండల రిపోర్టర్
మోటకొండూరు మండల కేంద్రంలో మూడవ అంగన్వాడీ కేంద్రానికి పూర్వ ప్రాథమిక విద్యా అవసరాల నిమిత్తం మెటీరియల్ను యువ నాయకుడు,మోటకొండూరు మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,గ్రామ పంచాయతీ 12వ వార్డు సభ్యులు జూకంటి మధు తన స్వంత నిధులతో అందజేశారు.“నేటి బాలలే రేపటి పౌరులు”అనే సంకల్పంతో,చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశ్యంతో అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కుర్చీలు,పలకలు, పుస్తకాలు,టేబుల్స్,ఫ్యాన్,గ్యాస్ స్టవ్ తదితర సామగ్రిని అంగన్వాడీ కార్యకర్తకు ఆయన స్వహస్తాలతో అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మంగ కిరణ్,మోటకొండూరు గ్రామ సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు 12వ వార్డు అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని,గ్రామాభివృద్ధికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని,అలాంటి కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ అధికారులు,అంగన్వాడీ టీచర్,పిల్లల తల్లిదండ్రులు జూకంటి మధుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కరుని రఘునాథరాజు,గ్రామ శాఖ అధ్యక్షులు బుగ్గ కొమురయ్య,వంగాల మహేందర్,కురుమ సంఘం అధ్యక్షులు బాల్ద సిద్ధులు,మాజీ మండల ఉపాధ్యక్షులు భూమండ్ల అశోక్,గాజుల వెంకటేష్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగు శేఖర్ రెడ్డి,భూమండ్ల వెంకటేష్,కొల్లూరు రంజిత్,ఆలేరు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆలేటి ఉమేష్,వినయ్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి