Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 06:41 AM

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ
February 26, 2026 03:44 PM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కనీస వేతనాలు, గ్రాచ్యుటీ అమలు చేయాలని డిమాండ్

అంగన్వాడీ ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, తక్కువ వేతనాల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి తరాన్ని తీర్చిదిద్దే బాధ్యతను మోస్తున్న అంగన్వాడీలు నేటి బాలల సంరక్షణ, పోషణ, గర్భిణీల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు.

ఐసిడిఎస్‌ కార్యక్రమం అభివృద్ధికి అంగన్వాడీల శ్రమే ప్రధాన కారణమని, అయినప్పటికీ ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం అన్యాయమని అన్నారు. ఉద్యోగులతో సమానంగా, అంతకంటే ఎక్కువగా పని చేస్తున్నా కనీస కార్మిక హక్కులు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడల్లా అదనపు బాధ్యతలను అంగన్వాడీలపై మోపుతున్నారని తెలిపారు.

ఉన్నత న్యాయస్థానాల తీర్పుల ప్రకారం కనీస వేతనాలు, గ్రాచ్యుటీ, పీఎఫ్‌, ఈఎస్ఐ వంటి సదుపాయాలు అమలు చేయాలని, వేసవి సెలవులు పూర్తిగా ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2024లో జారీ చేసిన జీఓ నెం.8 ప్రకారం కూడా గ్రాచ్యుటీ చట్టం అమలు కాలేదని, గత ఏడు సంవత్సరాలుగా వేతనాల పెంపు జరగలేదని పేర్కొన్నారు. మరోవైపు పిల్లలు, గర్భిణీలకు అందాల్సిన సరుకుల నాణ్యత, పరిమాణం పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీఅంగన్వాడీ కార్యకర్తల నాయకుడు ఏ. విజయ్‌కుమార్, సీపీఐ పట్టణ సహకారదర్శి లక్ష్మీనారాయణ, లింగప్ప,ఏఐవైఎఫ్ కార్యదర్శి అంజిత్‌గౌడ్‌తో పాటు అధ్యక్షురాలు జానకి, ఈరమ్మ, గీత, సుస్మిరి, రోషన్‌, శాంతి, సరస్వతి, శంకరమ్మ, రేణుక, సరోజ, రాజ్యలక్ష్మి, కమల, జ్యోతి, విజయ, భూలక్ష్మి తదితర అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News