Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:59 PM

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ
26-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కనీస వేతనాలు, గ్రాచ్యుటీ అమలు చేయాలని డిమాండ్

అంగన్వాడీ ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, తక్కువ వేతనాల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి తరాన్ని తీర్చిదిద్దే బాధ్యతను మోస్తున్న అంగన్వాడీలు నేటి బాలల సంరక్షణ, పోషణ, గర్భిణీల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు.

ఐసిడిఎస్‌ కార్యక్రమం అభివృద్ధికి అంగన్వాడీల శ్రమే ప్రధాన కారణమని, అయినప్పటికీ ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం అన్యాయమని అన్నారు. ఉద్యోగులతో సమానంగా, అంతకంటే ఎక్కువగా పని చేస్తున్నా కనీస కార్మిక హక్కులు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడల్లా అదనపు బాధ్యతలను అంగన్వాడీలపై మోపుతున్నారని తెలిపారు.

ఉన్నత న్యాయస్థానాల తీర్పుల ప్రకారం కనీస వేతనాలు, గ్రాచ్యుటీ, పీఎఫ్‌, ఈఎస్ఐ వంటి సదుపాయాలు అమలు చేయాలని, వేసవి సెలవులు పూర్తిగా ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2024లో జారీ చేసిన జీఓ నెం.8 ప్రకారం కూడా గ్రాచ్యుటీ చట్టం అమలు కాలేదని, గత ఏడు సంవత్సరాలుగా వేతనాల పెంపు జరగలేదని పేర్కొన్నారు. మరోవైపు పిల్లలు, గర్భిణీలకు అందాల్సిన సరుకుల నాణ్యత, పరిమాణం పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీఅంగన్వాడీ కార్యకర్తల నాయకుడు ఏ. విజయ్‌కుమార్, సీపీఐ పట్టణ సహకారదర్శి లక్ష్మీనారాయణ, లింగప్ప,ఏఐవైఎఫ్ కార్యదర్శి అంజిత్‌గౌడ్‌తో పాటు అధ్యక్షురాలు జానకి, ఈరమ్మ, గీత, సుస్మిరి, రోషన్‌, శాంతి, సరస్వతి, శంకరమ్మ, రేణుక, సరోజ, రాజ్యలక్ష్మి, కమల, జ్యోతి, విజయ, భూలక్ష్మి తదితర అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.ఏఐటీయూసీ

Article Image

కనీస వేతనాలు, గ్రాచ్యుటీ అమలు చేయాలని డిమాండ్

అంగన్వాడీ ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, తక్కువ వేతనాల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి తరాన్ని తీర్చిదిద్దే బాధ్యతను మోస్తున్న అంగన్వాడీలు నేటి బాలల సంరక్షణ, పోషణ, గర్భిణీల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదని పేర్కొన్నారు.

ఐసిడిఎస్‌ కార్యక్రమం అభివృద్ధికి అంగన్వాడీల శ్రమే ప్రధాన కారణమని, అయినప్పటికీ ప్రభుత్వం వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం అన్యాయమని అన్నారు. ఉద్యోగులతో సమానంగా, అంతకంటే ఎక్కువగా పని చేస్తున్నా కనీస కార్మిక హక్కులు కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడల్లా అదనపు బాధ్యతలను అంగన్వాడీలపై మోపుతున్నారని తెలిపారు.

ఉన్నత న్యాయస్థానాల తీర్పుల ప్రకారం కనీస వేతనాలు, గ్రాచ్యుటీ, పీఎఫ్‌, ఈఎస్ఐ వంటి సదుపాయాలు అమలు చేయాలని, వేసవి సెలవులు పూర్తిగా ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

2024లో జారీ చేసిన జీఓ నెం.8 ప్రకారం కూడా గ్రాచ్యుటీ చట్టం అమలు కాలేదని, గత ఏడు సంవత్సరాలుగా వేతనాల పెంపు జరగలేదని పేర్కొన్నారు. మరోవైపు పిల్లలు, గర్భిణీలకు అందాల్సిన సరుకుల నాణ్యత, పరిమాణం పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీఅంగన్వాడీ కార్యకర్తల నాయకుడు ఏ. విజయ్‌కుమార్, సీపీఐ పట్టణ సహకారదర్శి లక్ష్మీనారాయణ, లింగప్ప,ఏఐవైఎఫ్ కార్యదర్శి అంజిత్‌గౌడ్‌తో పాటు అధ్యక్షురాలు జానకి, ఈరమ్మ, గీత, సుస్మిరి, రోషన్‌, శాంతి, సరస్వతి, శంకరమ్మ, రేణుక, సరోజ, రాజ్యలక్ష్మి, కమల, జ్యోతి, విజయ, భూలక్ష్మి తదితర అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News