Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:33 PM

అంగన్వాడీ సిబ్బంది ఆందోళన తీవ్రం

అంగన్వాడీ సిబ్బంది ఆందోళన తీవ్రం

అంగన్వాడీ సిబ్బంది ఆందోళన తీవ్రం
March 23, 2026 06:45 PM 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కలెక్టరేట్ ముట్టడి

అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ వందలాది మంది సిబ్బంది జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టీచర్లు, సహాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు కూడా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారి అప్పులపాలు అవుతున్నారని తెలిపారు.

అంగన్వాడీ టీచర్ల జీవితం రోజు కూలీల కంటే అధ్వానంగా మారిందని పేర్కొంటూ, కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవులు ప్రకటించే ఉత్తర్వులు విడుదల చేయాలని, ఐసిడిఎస్‌కు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.

ప్రీ ప్రాథమిక విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారానే నిర్వహించాలని, సిబ్బందిపై రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రజాప్రతినిధి క్షమాపణ చెప్పాలని కూడా కోరారు.

సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నందా పవర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఇక ఈ సందర్భంగా దాదాపు ఐదు వందల మంది అంగన్వాడీ టీచర్లు, సహాయకులు తమ పాత సంఘానికి రాజీనామా చేసి కార్మిక సంఘంలో చేరారు. పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, విద్యార్థి సంఘ ప్రతినిధులు, ఇతర కార్మిక సంఘాల నాయకులు, అంగన్వాడీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News