Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:58 AM

ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
22-03-2026 144 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆదోని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,63,680 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ గత 18 నెలల్లో ఆదోని నియోజకవర్గంలో మొత్తం 519 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,85,63,758 సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించబడినట్లు తెలిపారు. ఇంకా 267 మందికి రావాల్సిన చెక్కులు త్వరలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన మరిన్ని లబ్ధిదారులకు సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆసుపత్రి చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా మారిందని, పేద ప్రజల ప్రాణాలను కాపాడే సంక్షేమ కార్యక్రమంగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Article Image

ఆదోని: ఆదోని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,63,680 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ గత 18 నెలల్లో ఆదోని నియోజకవర్గంలో మొత్తం 519 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,85,63,758 సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించబడినట్లు తెలిపారు. ఇంకా 267 మందికి రావాల్సిన చెక్కులు త్వరలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన మరిన్ని లబ్ధిదారులకు సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆసుపత్రి చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా మారిందని, పేద ప్రజల ప్రాణాలను కాపాడే సంక్షేమ కార్యక్రమంగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News