ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Editor Desk
ఆదోని: ఆదోని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,63,680 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ గత 18 నెలల్లో ఆదోని నియోజకవర్గంలో మొత్తం 519 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,85,63,758 సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించబడినట్లు తెలిపారు. ఇంకా 267 మందికి రావాల్సిన చెక్కులు త్వరలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన మరిన్ని లబ్ధిదారులకు సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆసుపత్రి చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా మారిందని, పేద ప్రజల ప్రాణాలను కాపాడే సంక్షేమ కార్యక్రమంగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి