Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి అర్హ ఓటరును నమోదు చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పిలుపు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:36 PM

ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆదోనిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
March 22, 2026 04:19 PM 138 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆదోని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గానికి చెందిన 30 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,63,680 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ గత 18 నెలల్లో ఆదోని నియోజకవర్గంలో మొత్తం 519 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1,85,63,758 సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించబడినట్లు తెలిపారు. ఇంకా 267 మందికి రావాల్సిన చెక్కులు త్వరలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన మరిన్ని లబ్ధిదారులకు సహాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఆర్థికంగా బలహీన వర్గాలకు ఆసుపత్రి చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా మారిందని, పేద ప్రజల ప్రాణాలను కాపాడే సంక్షేమ కార్యక్రమంగా ప్రభుత్వం దీనిని అమలు చేస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News