అందోల్, స్థానికం ప్రతినిధి.
అందోల్ -జోగిపేట మున్సిపాలిటీ 7వ వార్డులో బిఆరెస్ నాయకులు ఇంటింటా కాంగ్రెస్ బాకీ కార్డులను అందజేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజులలో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను 2సంవత్సరాలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం పై మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇంటికి ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. అమలు కానీ హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓట్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆరెస్ నాయకులు షకీల్, వడ్ల శ్రీనివాస్, శివ, నాగరాజు, దానిష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి