అందోల్- జోగిపేట మున్సిపాలిటీని బిఆర్ఎస్ కైవసం చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
అందోల్- జోగిపేట మున్సిపాలిటీని బిఆర్ఎస్ కైవసం చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
Sandeep journalist
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అందోల్ము -జోగిపేట మున్సిపాలిటీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షుడు సారా శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ జెడ్పి చైర్మన్ జైపాల్ రెడ్డి, మున్సిపాల్ ఎన్నికల పరిశీలకుడు ఇంచార్జ్ నరసింహరెడ్డి తో పాటు సీనియర్ నాయకులు మాసాన్ పల్లి నారాయణ కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ జండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలని మున్సిపాలిటీ ని కైవసం చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న పెద్దలు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని సమావేశంలో పాల్గొన్న ఆందోల్ మాజీ ఎం ఎల్ యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో దాదాపు 100 కోట్ల నిధులను తీసుకొచ్చి పట్టణంలో సిసి రోడ్లను, డ్రైనేజీలను, అంతర్గత రోడ్లను వేయించానని రెండేళ్లలో మంత్రిగారు ఒక్క పని కూడా చేయించలేదని ఈ సందర్భంగా విమర్శించారు. తాము మంజూరు చేసిన నిధులను అటుతింపు ఇటు తీంపి పనులుచేస్తున్నారు తప్పించి ఆందోల్ మున్సిపాలిటీకి దామోదర్ రాజనర్సింహా చేసింది ఏమీ లేదని అందుకే మళ్ళీ బిఆర్ఎస్ వైపే ప్రజలు ముగ్గురు చూపుతున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఐక్యమత్తంగా పనిచేస్తే విజయం మనదేనా అని అందుకు అందరు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి