Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:03 AM

అందోల్- జోగిపేట మున్సిపాలిటీని బిఆర్ఎస్ కైవసం చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

అందోల్- జోగిపేట మున్సిపాలిటీని బిఆర్ఎస్ కైవసం చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

అందోల్- జోగిపేట మున్సిపాలిటీని బిఆర్ఎస్  కైవసం చేసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
January 13, 2026 08:42 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అందోల్ము -జోగిపేట మున్సిపాలిటీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షుడు సారా శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ జెడ్పి చైర్మన్ జైపాల్ రెడ్డి, మున్సిపాల్ ఎన్నికల పరిశీలకుడు ఇంచార్జ్ నరసింహరెడ్డి తో పాటు సీనియర్ నాయకులు మాసాన్ పల్లి నారాయణ కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ జండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలని మున్సిపాలిటీ ని కైవసం చేసుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో పాల్గొన్న పెద్దలు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని సమావేశంలో పాల్గొన్న ఆందోల్ మాజీ ఎం ఎల్ యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో దాదాపు 100 కోట్ల నిధులను తీసుకొచ్చి పట్టణంలో సిసి రోడ్లను, డ్రైనేజీలను, అంతర్గత రోడ్లను వేయించానని రెండేళ్లలో మంత్రిగారు ఒక్క పని కూడా చేయించలేదని ఈ సందర్భంగా విమర్శించారు. తాము మంజూరు చేసిన నిధులను అటుతింపు ఇటు తీంపి పనులుచేస్తున్నారు తప్పించి ఆందోల్ మున్సిపాలిటీకి దామోదర్ రాజనర్సింహా చేసింది ఏమీ లేదని అందుకే మళ్ళీ బిఆర్ఎస్ వైపే ప్రజలు ముగ్గురు చూపుతున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలు అందరూ కూడా ఐక్యమత్తంగా పనిచేస్తే విజయం మనదేనా అని అందుకు అందరు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News