Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 02:59 AM

ఆదిత్య కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

ఆదిత్య కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా వివాహ మహోత్సవం

ఆదిత్య కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా వివాహ మహోత్సవం
March 06, 2026 05:04 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టే జానయ్య యాదవ్

వరంగల్ జిల్లా కేంద్రంలోని ఆదిత్య కన్వెన్షన్ హాల్‌లో గొడుగు శ్రీహరి, కౌసల్య దంపతుల కుమారుని వివాహ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. బంధుమిత్రులు, ఆహ్వానితుల సమక్షంలో నిర్వహించిన ఈ వేడుకకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధమని అన్నారు. పరస్పర అవగాహన, ప్రేమ, సహకారంతో వధూవరులు తమ కుటుంబ జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. సమాజంలో మంచి ఆదర్శంగా నిలిచే విధంగా జీవితం సాగించాలని ఆశీర్వదించారు. వివాహ వేడుకలో బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుక సందర్భంగా ఆహ్వానితులు వధూవరులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వల్లాల సైదులు యాదవ్, లింగాల సైదులు, శేఖర్, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News