ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్
మండలంలోని సిరిపురం గ్రామంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్కు చేరి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి చేపట్టిన ప్రచారం వేగం పెంచుకుంది. సోమవారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో భేటీ అయిన ఆయన, ఇప్పటివరకు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలతో పాటు చేపట్టాలనుకుంటున్న పనులను ఓటర్లకు వివరించారు.ప్రచారానికి గ్రామస్తులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని ఉపేంద్ర రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలు తమకు బాగా తెలిసినందున, వాటి పరిష్కారానికి తాను ముందుండి పోరాడతానని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమాభిమానాలకు, తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి ఉపేంద్ర–రవీందర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, పున్న వెంకటేష్, కునూరు ముత్తయ్య, రాపోలు స్వామి, జెల్ల లక్ష్మినారాయణ, గాదె శంకరయ్య, రామచంద్రం, కట్ట భానుశ్రీ సతీష్ రెడ్డి, ముడుదుడ్ల రమేష్, గండికోట కుమార్, కంకల లింగస్వామి, కునూరు రమేష్, లింగస్వామి, మహేష్, రాజు, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి