Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:10 AM

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
December 08, 2025 01:03 PM 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

మండలంలోని సిరిపురం గ్రామంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కు చేరి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి చేపట్టిన ప్రచారం వేగం పెంచుకుంది. సోమవారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో భేటీ అయిన ఆయన, ఇప్పటివరకు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలతో పాటు చేపట్టాలనుకుంటున్న పనులను ఓటర్లకు వివరించారు.ప్రచారానికి గ్రామస్తులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని ఉపేంద్ర రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలు తమకు బాగా తెలిసినందున, వాటి పరిష్కారానికి తాను ముందుండి పోరాడతానని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమాభిమానాలకు, తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి ఉపేంద్ర–రవీందర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, పున్న వెంకటేష్, కునూరు ముత్తయ్య, రాపోలు స్వామి, జెల్ల లక్ష్మినారాయణ, గాదె శంకరయ్య, రామచంద్రం, కట్ట భానుశ్రీ సతీష్ రెడ్డి, ముడుదుడ్ల రమేష్, గండికోట కుమార్, కంకల లింగస్వామి, కునూరు రమేష్, లింగస్వామి, మహేష్, రాజు, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News