Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
08-12-2025 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

మండలంలోని సిరిపురం గ్రామంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కు చేరి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి చేపట్టిన ప్రచారం వేగం పెంచుకుంది. సోమవారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో భేటీ అయిన ఆయన, ఇప్పటివరకు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలతో పాటు చేపట్టాలనుకుంటున్న పనులను ఓటర్లకు వివరించారు.ప్రచారానికి గ్రామస్తులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని ఉపేంద్ర రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలు తమకు బాగా తెలిసినందున, వాటి పరిష్కారానికి తాను ముందుండి పోరాడతానని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమాభిమానాలకు, తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి ఉపేంద్ర–రవీందర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, పున్న వెంకటేష్, కునూరు ముత్తయ్య, రాపోలు స్వామి, జెల్ల లక్ష్మినారాయణ, గాదె శంకరయ్య, రామచంద్రం, కట్ట భానుశ్రీ సతీష్ రెడ్డి, ముడుదుడ్ల రమేష్, గండికోట కుమార్, కంకల లింగస్వామి, కునూరు రమేష్, లింగస్వామి, మహేష్, రాజు, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.




Sthanikam

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

Article Image

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

మండలంలోని సిరిపురం గ్రామంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కు చేరి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి చేపట్టిన ప్రచారం వేగం పెంచుకుంది. సోమవారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో భేటీ అయిన ఆయన, ఇప్పటివరకు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలతో పాటు చేపట్టాలనుకుంటున్న పనులను ఓటర్లకు వివరించారు.ప్రచారానికి గ్రామస్తులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని ఉపేంద్ర రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలు తమకు బాగా తెలిసినందున, వాటి పరిష్కారానికి తాను ముందుండి పోరాడతానని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమాభిమానాలకు, తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి ఉపేంద్ర–రవీందర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, పున్న వెంకటేష్, కునూరు ముత్తయ్య, రాపోలు స్వామి, జెల్ల లక్ష్మినారాయణ, గాదె శంకరయ్య, రామచంద్రం, కట్ట భానుశ్రీ సతీష్ రెడ్డి, ముడుదుడ్ల రమేష్, గండికోట కుమార్, కంకల లింగస్వామి, కునూరు రమేష్, లింగస్వామి, మహేష్, రాజు, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News