Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:21 PM

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి

ఆదరించండి అభివృద్ధి చేస్తా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
December 08, 2025 01:03 PM 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

మండలంలోని సిరిపురం గ్రామంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కు చేరి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి చేపట్టిన ప్రచారం వేగం పెంచుకుంది. సోమవారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో భేటీ అయిన ఆయన, ఇప్పటివరకు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలతో పాటు చేపట్టాలనుకుంటున్న పనులను ఓటర్లకు వివరించారు.ప్రచారానికి గ్రామస్తులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. తనకు అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తానని ఉపేంద్ర రవీందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలు, ప్రజల అవసరాలు తమకు బాగా తెలిసినందున, వాటి పరిష్కారానికి తాను ముందుండి పోరాడతానని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు చూపుతున్న ప్రేమాభిమానాలకు, తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబటి ఉపేంద్ర–రవీందర్ రెడ్డి, బండ శ్రీనివాస్ రెడ్డి, ఏళ్ల సంజీవరెడ్డి, పున్న వెంకటేష్, కునూరు ముత్తయ్య, రాపోలు స్వామి, జెల్ల లక్ష్మినారాయణ, గాదె శంకరయ్య, రామచంద్రం, కట్ట భానుశ్రీ సతీష్ రెడ్డి, ముడుదుడ్ల రమేష్, గండికోట కుమార్, కంకల లింగస్వామి, కునూరు రమేష్, లింగస్వామి, మహేష్, రాజు, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News