Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:04 AM

ఆచార్య స్కూల్ వార్షికోత్సవం: సీనియర్ సివిల్ జడ్జి హాజరు

ఆచార్య స్కూల్ వార్షికోత్సవం: సీనియర్ సివిల్ జడ్జి హాజరు

ఆచార్య స్కూల్ వార్షికోత్సవం: సీనియర్ సివిల్ జడ్జి హాజరు
27-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య స్కూల్‌లో ఈ నెల 27వ తేదీ శుక్రవారం వార్షిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6.30 గంటలకు రాయల్ కాలనీ సమీపంలోని స్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి–కమ్–చైర్మన్ ఎంఎల్ఎస్‌సీ జి. కవితా దేవి హాజరుకానున్నారు. అతిథులుగా జహీరాబాద్ టౌన్ సి.ఐ. ఎస్. శివలింగం, మండల విద్యాధికారి మాణయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు, దేశభక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారికి సన్మానం కూడా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, సిబ్బంది కోరారు.

Sthanikam

ఆచార్య స్కూల్ వార్షికోత్సవం: సీనియర్ సివిల్ జడ్జి హాజరు

Article Image

జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య స్కూల్‌లో ఈ నెల 27వ తేదీ శుక్రవారం వార్షిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6.30 గంటలకు రాయల్ కాలనీ సమీపంలోని స్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి–కమ్–చైర్మన్ ఎంఎల్ఎస్‌సీ జి. కవితా దేవి హాజరుకానున్నారు. అతిథులుగా జహీరాబాద్ టౌన్ సి.ఐ. ఎస్. శివలింగం, మండల విద్యాధికారి మాణయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు, దేశభక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారికి సన్మానం కూడా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, సిబ్బంది కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News