ఆచార్య స్కూల్ వార్షికోత్సవం: సీనియర్ సివిల్ జడ్జి హాజరు
ఆచార్య స్కూల్ వార్షికోత్సవం: సీనియర్ సివిల్ జడ్జి హాజరు
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్ పట్టణంలోని ఆచార్య స్కూల్లో ఈ నెల 27వ తేదీ శుక్రవారం వార్షిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 6.30 గంటలకు రాయల్ కాలనీ సమీపంలోని స్కూల్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి–కమ్–చైర్మన్ ఎంఎల్ఎస్సీ జి. కవితా దేవి హాజరుకానున్నారు. అతిథులుగా జహీరాబాద్ టౌన్ సి.ఐ. ఎస్. శివలింగం, మండల విద్యాధికారి మాణయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు, దేశభక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చదువులో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన వారికి సన్మానం కూడా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, సిబ్బంది కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి