Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:55 AM

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి దామోదర రాజనర్సింహ

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి దామోదర రాజనర్సింహ

అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి దామోదర రాజనర్సింహ
June 02, 2026 08:43 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రూ.69.19 కోట్ల రుణాల పంపిణీతో మహిళా సంఘాలకు భారీ ఊతం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, సంక్షేమ పథకాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా దృష్టిలోపం కలిగిన నలుగురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడంతో పాటు 768 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద రూ.69.19 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ట్రాన్స్‌జెండర్‌లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే పీఎం శ్రీ పాఠశాలల్లో వేసవి శిబిరాల నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు.అంతకుముందు ఐబీ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News