Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 24, 2026 08:30 PM

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జాతీయ సదస్సు

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జాతీయ సదస్సు

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జాతీయ సదస్సు
March 24, 2026 06:45 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా) 26వ జాతీయ సదస్సు బుధవారం నుంచి రెండు రోజుల పాటు ప్రారంభమవుతోంది. “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై నిర్వహించే ఈ సదస్సులో డిజిటల్ పరివర్తన, విధానపరమైన మార్పులు, సమ్మిళిత విద్యాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి.

ఈ సదస్సు ప్రారంభోత్సవానికి BRAOU వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించగా, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆనందరావు విష్ణు పాటిల్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. IGNOU ఉపకులపతి ప్రొ. ఉమా కంజిలాల్, కేరళ డిజిటల్ యూనివర్సిటీ వీసీ ప్రొ. సాజి గోపీనాథ్ విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ కీలకోపన్యాసం చేయనున్నారు.

సదస్సులో భాగంగా “డిజిటల్ టెక్నాలజీ: ఓడీఎల్ భవిష్యత్తు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం, ప్యానెల్ చర్చలు, సాంకేతిక సమావేశాలు నిర్వహించనున్నారు. రెండవ రోజు డిజిటల్ లెర్నింగ్ నిపుణుడు ప్రొ. సంజయ్ మిశ్రా స్మారక ఉపన్యాసంతో కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి 100కు పైగా పరిశోధకులు పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News