Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:24 PM

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జాతీయ సదస్సు

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జాతీయ సదస్సు

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుంచి జాతీయ సదస్సు
March 24, 2026 06:45 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా) 26వ జాతీయ సదస్సు బుధవారం నుంచి రెండు రోజుల పాటు ప్రారంభమవుతోంది. “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై నిర్వహించే ఈ సదస్సులో డిజిటల్ పరివర్తన, విధానపరమైన మార్పులు, సమ్మిళిత విద్యాభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి.

ఈ సదస్సు ప్రారంభోత్సవానికి BRAOU వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించగా, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆనందరావు విష్ణు పాటిల్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. IGNOU ఉపకులపతి ప్రొ. ఉమా కంజిలాల్, కేరళ డిజిటల్ యూనివర్సిటీ వీసీ ప్రొ. సాజి గోపీనాథ్ విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ కీలకోపన్యాసం చేయనున్నారు.

సదస్సులో భాగంగా “డిజిటల్ టెక్నాలజీ: ఓడీఎల్ భవిష్యత్తు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం, ప్యానెల్ చర్చలు, సాంకేతిక సమావేశాలు నిర్వహించనున్నారు. రెండవ రోజు డిజిటల్ లెర్నింగ్ నిపుణుడు ప్రొ. సంజయ్ మిశ్రా స్మారక ఉపన్యాసంతో కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి 100కు పైగా పరిశోధకులు పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించనున్నారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News