ఆటో డ్రైవర్ నుంచి గ్రామ ప్రథమ పౌరుడిగా.. ములంగుర్ సర్పంచ్గా 'పూదరి రాజు' అద్భుత విజయం!
ఆటో డ్రైవర్ నుంచి గ్రామ ప్రథమ పౌరుడిగా.. ములంగుర్ సర్పంచ్గా 'పూదరి రాజు' అద్భుత విజయం!
Editor Desk
సామాన్య ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తికి అధికారం అప్పగిస్తే మార్పు ఎలా ఉంటుందో శంకరపట్నం మండలం నిరూపించింది. నిత్యం ఆటోలో కూరగాయలు అమ్ముతూ, చికెన్ సెంటర్ నడుపుకుంటూ సామాన్య జీవితం గడిపే పూదరి రాజు, నేడు ములంగుర్ గ్రామ సర్పంచ్గా గెలుపొంది అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగుర్ గ్రామానికి చెందిన పూదరి రాజుది చాలా సాధారణ నేపథ్యం. ఆయన గ్రామంలో ఆటో తిరుగుతూ కూరగాయలు అమ్మడంతో పాటు, ఒక చిన్న చికెన్ సెంటర్ను కూడా నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ అందరితో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండటమే ఈ రోజు ఆయనను విజయతీరాలకు చేర్చింది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తన ప్రత్యర్థిపై 53 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
డబ్బు, అంగబలం కంటే ప్రజలతో ఉన్న అనుబంధమే గొప్పదని రాజు గారి విజయం నిరూపించింది. ఆటో నడుపుతూ గ్రామస్తులందరికీ సుపరిచితుడైన రాజు, సర్పంచ్గా ఎన్నికవ్వడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "మా కష్టాలు తెలిసిన వ్యక్తి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మాకుంది" అని ఓటర్లు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి