Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:57 AM

632 మంది సేవలు నిలిపివేత మెమో రద్దు చేయాలి

632 మంది సేవలు నిలిపివేత మెమో రద్దు చేయాలి

632 మంది సేవలు నిలిపివేత మెమో రద్దు చేయాలి
February 25, 2026 06:23 PM 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టైపిస్టు–కంప్యూటర్ నిర్వాహకులకు వేతన శ్రేణి కల్పించాలి

యాదాద్రి భువనగిరి: రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న టైపిస్టు–కంప్యూటర్ నిర్వాహకుల సేవలను యథావిధిగా కొనసాగించాలని, వేతన శ్రేణి కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాకు చెందిన సిబ్బంది వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు, సంయుక్త చర్యా సమితి చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సి. జగన్ మోహన్ ప్రసాద్‌ను కలిసి సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా మందడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 632 మంది టైపిస్టు–కంప్యూటర్ నిర్వాహకుల సేవలను నిలిపివేస్తూ జారీ చేసిన మెమోను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజావాణి పోర్టల్ నిర్వహణ, రేషన్ కార్డుల జారీ, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల అమలులో వీరి పాత్ర కీలకమని తెలిపారు.

ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వెంటనే వేతన శ్రేణి కల్పించి శాశ్వత ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులను పోషిస్తున్న నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ సిబ్బందిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సి. జగన్ మోహన్ ప్రసాద్, జిల్లా కోశాధికారి కంచనపల్లి శ్రీకాంత్, నాయకులు ఆర్. గణేశ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News