PRINT TIME: April 29, 2026 09:16 PM
585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్
585 మార్కులతో కంగ్టి మండలంలో తొలి స్థానంలో భూపాల్
April 29, 2026 07:27 PM
43 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో కంగ్టి మండల స్థాయిలో గిరిజన గురుకుల విద్యార్థి రాథోడ్ భూపాల్ 585 మార్కులతో మండల టాపర్గా నిలిచి ప్రతిభ చాటాడు. రెండవ స్థానంలో తడకల్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేయ 581 మార్కులతో నిలిచింది. మండలంలో మొత్తం 382 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 376 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈఓ రైహముద్దీన్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషి ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఈ ఫలితాలతో మండల వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి