42వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన శరత్ చంద్ర
42వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన శరత్ చంద్ర
Krishna
సదాశివపేట పట్టణంలోని శ్రీ ఆధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఒక పేషెంట్కు అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడగా విషయం తెలిసిన వెంటనే మన సమాజం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం మహేష్ స్వామి స్పందించి పేషెంట్ వివరాలను ఫౌండేషన్ సభ్యులు మరియు పరిచయస్తులకు పంపించారు. ఈ సమాచారాన్ని చూసిన కోడూరు శరత్ చంద్ర వెంటనే ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు. ఇప్పటివరకు ఆయన 42వ సారి రక్తదానం చేయడం విశేషం. అత్యవసర సమయంలో స్పందించి ప్రాణ రక్షణకు సహకరించిన శరత్ చంద్రకు ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జంగం మహేష్ స్వామి మాట్లాడుతూ సమాజంలో ఎవరికైనా రక్తం అవసరం ఉన్నప్పుడు మన సమాజం ఫౌండేషన్ సభ్యులు ఎప్పుడూ ముందుండి సేవలు అందిస్తున్నారని, ఇప్పటివరకు అనేక మందికి రక్తదానం ద్వారా సహాయం చేసినట్లు తెలిపారు. రక్తదానం మహాదానం అని, యువత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. సమయానికి స్పందించి సహాయం చేసిన ఫౌండేషన్ నిర్వాహకులకు మరియు రక్తదాత కోడూరు శరత్ చంద్రకు పేషెంట్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి