23న టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 4వ మహాసభ
23న టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 4వ మహాసభ
Biksham
కరపత్రం ఆవిష్కరించిన అడ్హక్ కమిటీ
మహాసభను విజయవంతం చేయాలని పిలుపు
సూర్యాపేట, జనవరి 12:
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా 4వ మహాసభ ఈ నెల 23న జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ జిల్లా అడ్హక్ కమిటీ నాయకులు ప్రకటించారు.ఈ మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం కమిటీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మహాసభలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా జర్నలిస్టుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.జర్నలిస్టుల దీర్ఘకాలిక డిమాండ్లైన అక్రెడిటేషన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, ఉచిత బస్ పాస్ తదితర హక్కుల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
ఫెడరేషన్ చేపడుతున్న ఉద్యమాలకు జిల్లాలోని జర్నలిస్టులంతా ఐక్యంగా కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పాల్వాయి జానయ్య, కో కన్వీనర్లు ముషం హరిప్రసాద్, లింగాల సాయిబాబా, నందిపాటి సైదులు, శ్రీరాముల కృష్ణ, తాందారపల్లి శ్రీనివాస్, నాయకులు గుడపూరి ప్రభాకర్, పాల్వాయి అజయ్, పి. సతీష్, ఎస్. సైదులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి