Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:02 PM

23న టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 4వ మహాసభ

23న టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 4వ మహాసభ

23న టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా 4వ మహాసభ
January 12, 2026 04:43 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కరపత్రం ఆవిష్కరించిన అడ్‌హక్ కమిటీ

మహాసభను విజయవంతం చేయాలని పిలుపు

సూర్యాపేట, జనవరి 12:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా 4వ మహాసభ ఈ నెల 23న జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ జిల్లా అడ్‌హక్ కమిటీ నాయకులు ప్రకటించారు.ఈ మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని సోమవారం కమిటీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా మహాసభలు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా జర్నలిస్టుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు.జర్నలిస్టుల దీర్ఘకాలిక డిమాండ్లైన అక్రెడిటేషన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్, జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, ఉచిత బస్ పాస్ తదితర హక్కుల సాధన కోసం టీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

ఫెడరేషన్ చేపడుతున్న ఉద్యమాలకు జిల్లాలోని జర్నలిస్టులంతా ఐక్యంగా కలిసి రావాలని వారు పిలుపునిచ్చారు.

ఈ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పాల్వాయి జానయ్య, కో కన్వీనర్లు ముషం హరిప్రసాద్, లింగాల సాయిబాబా, నందిపాటి సైదులు, శ్రీరాముల కృష్ణ, తాందారపల్లి శ్రీనివాస్, నాయకులు గుడపూరి ప్రభాకర్, పాల్వాయి అజయ్, పి. సతీష్, ఎస్. సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News