23 నుంచి 26 వరకు అంగన్వాడి రిలే నిరాహార దీక్షలు
23 నుంచి 26 వరకు అంగన్వాడి రిలే నిరాహార దీక్షలు
Editor Desk
హామీలు మరిచిన ప్రభుత్వానికి అంగన్వాడీల ఐక్య పోరాట హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. గతంలో 42 రోజులపాటు సమ్మెలు, నిరాహార దీక్షలు నిర్వహించినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోకపోవడం బాధాకరమని మండిపడ్డారు.
“మా ప్రభుత్వం వస్తే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం” అన్న హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. వేతనాల పెంపు, భద్రతా సౌకర్యాలు, సేవా నియమావళి అమలు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం నిరాశ కలిగించిందన్నారు.
ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలకు గతంలో ప్రజలే గుణపాఠం చెప్పారని నాయకులు హెచ్చరించారు. ఇకపై నిర్లక్ష్యం కొనసాగితే మరింత ఉధృతమైన ప్రజాస్వామ్య ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఈ నెల 23 నుంచి 26 వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షల్లో అధ్యక్షురాలు ఈరమ్మ, జిల్లా కౌన్సిల్ సభ్యురాలు జానకి, గౌసియా, ప్రభావతి, గీత, అనురాధ, రేణుక, సరళ, జ్యోతి, భూలక్ష్మి పాల్గొన్నారు. సిపిఐ పట్టణ సహకార కార్యదర్శి కె. రమేష్ కుమార్, ఏటీసీ అంగన్వాడి కార్యనిర్వాహకులు ఏ. విజయ్ కుమార్ తదితరులు సంఘీభావం తెలిపారు.
అంగన్వాడి సోదరీమణులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యమని, హామీలు నిలబెట్టుకునే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి