Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న పెద్దమంతూర్ వంతెన పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 06:30 PM

23 నుంచి 26 వరకు అంగన్వాడి రిలే నిరాహార దీక్షలు

23 నుంచి 26 వరకు అంగన్వాడి రిలే నిరాహార దీక్షలు

23 నుంచి 26 వరకు అంగన్వాడి  రిలే నిరాహార దీక్షలు
February 24, 2026 04:19 AM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హామీలు మరిచిన ప్రభుత్వానికి అంగన్వాడీల ఐక్య పోరాట హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తలు, సహాయకులు మరోసారి ఉద్యమ బాట పట్టారు. గతంలో 42 రోజులపాటు సమ్మెలు, నిరాహార దీక్షలు నిర్వహించినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చిన నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోకపోవడం బాధాకరమని మండిపడ్డారు.

“మా ప్రభుత్వం వస్తే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం” అన్న హామీలు ఇప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. వేతనాల పెంపు, భద్రతా సౌకర్యాలు, సేవా నియమావళి అమలు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం నిరాశ కలిగించిందన్నారు.

ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలకు గతంలో ప్రజలే గుణపాఠం చెప్పారని నాయకులు హెచ్చరించారు. ఇకపై నిర్లక్ష్యం కొనసాగితే మరింత ఉధృతమైన ప్రజాస్వామ్య ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఈ నెల 23 నుంచి 26 వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షల్లో అధ్యక్షురాలు ఈరమ్మ, జిల్లా కౌన్సిల్ సభ్యురాలు జానకి, గౌసియా, ప్రభావతి, గీత, అనురాధ, రేణుక, సరళ, జ్యోతి, భూలక్ష్మి పాల్గొన్నారు. సిపిఐ పట్టణ సహకార కార్యదర్శి కె. రమేష్ కుమార్, ఏటీసీ అంగన్వాడి కార్యనిర్వాహకులు ఏ. విజయ్ కుమార్ తదితరులు సంఘీభావం తెలిపారు.

అంగన్వాడి సోదరీమణులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు సాధ్యమని, హామీలు నిలబెట్టుకునే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News