20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం
20వ వార్డులో వాటర్ ప్లాంట్ ప్రారంభం
K.RAVI
* ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చొరవతో ఏర్పాటు
మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను గురువారం ఘనంగా ప్రారంభించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో, 'దివిస్ లాబొరేటరీస్' కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఈ శుద్ధజల కేంద్రాన్ని నిర్మించారు.మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, వార్డు కౌన్సిలర్ ఎండి హన్ను కలసి రిబ్బన్ కట్ చేసి ఈ ప్లాంట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.తమ వార్డులో శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల 20వ వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, దానికి దివిస్ లాబొరేటరీస్ యాజమాన్యం సహకరించడం అభినందనీయమన్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ఇకపై తమ తాగునీటి సమస్యలు పూర్తిగా తీరిపోతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దివిస్ లాబొరేటరీస్ ప్రతినిధులు కిషోర్, గోపి, వార్డు ప్రజలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి