స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
గుండాల మండల పరిధిలోని వెల్మజాల గ్రామానికి చెందిన గురుకు ప్రశాంత్ (కారోబార్) గారి తండ్రి గురుకు మల్లయ్య గారు ఇటీవల అకాలంగా కన్నుమూయడం చాలా విషాదకరం. ఈ దుఃఖకర పరిస్థితిలో వారి కుటుంబానికి అండగా నిలవాలనే మంచి మనసుతో 2006–2007 విద్యాసంవత్సరానికి చెందిన 10వ తరగతి క్లాస్ మేట్స్ ముందుకొచ్చారు.
స్నేహభావం,మానవత్వం,బాధ్యతను చాటుతూ క్లాస్ మేట్స్ అందరూ కలిసి మొత్తం రూ.15,100/- (పదిహేనువేల వంద రూపాయలు) ఆర్థిక సాయాన్ని గురుకు ప్రశాంత్ గారి కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా “కష్టకాలంలో ఒకరికొకరం తోడుగా ఉండటమే నిజమైన స్నేహం” అనే భావనకు నిదర్శనంగా నిలిచారు.ఈ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి కొంతైనా ఊరటనిచ్చి, భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు సాగేందుకు తోడ్పడుతుందని ఆశిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో కూడా ఐక్యతను, స్నేహాన్ని నిలబెట్టుకుంటున్న 2006–2007 క్లాస్ మేట్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి