14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల కోటేశ్వరరావు గడప గడపకు ప్రచారం
14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల కోటేశ్వరరావు గడప గడపకు ప్రచారం
Harish HS
14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల కోటేశ్వరరావు గడప గడపకు ప్రచారం
పార్టీ సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలోని 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందుల కోటేశ్వరరావు గడపగడప ప్రచారం నిర్వహించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని రాష్ట్రంలోని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని అన్నారు.వార్డు ప్రజలకు పార్టీ సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి చేస్తామన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రజలకు అన్నివేళ అందుబాటులో ఉంటామన్నారు.ప్రచార కార్యక్రమంలో రామినేని శ్రీనివాస్,చంద్రరావు, కృష్ణయ్య,వెంకటేశ్వరావు, పాస్టర్ యేసయ్య, ముస్కు శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్ అలీ,రమణ రెడ్డి, మదన్ మోహన్ రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి