Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హరీష్ రావును కలిసిన ఉద్యమ నేత ఎస్.కె. చాంద్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 08, 2026 01:18 AM

13వ వార్డు ఘటనపై టిఆర్పీ ఆగ్రహం

13వ వార్డు ఘటనపై టిఆర్పీ ఆగ్రహం

13వ వార్డు ఘటనపై టిఆర్పీ ఆగ్రహం
February 12, 2026 06:22 PM 270 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బాధ్యులైన ఎస్‌ఐ ఏడుకొండలు, సీఐ రాజశేఖర్‌లను సస్పెండ్ చేయాలి – మామిడి అంజయ్య డిమాండ్

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13వ వార్డులో జరిగిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో కారు ఎక్కేందుకు వెళ్తున్న సందర్భంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ కుమారుడిపై దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ ఘటన పోలీసు శాఖకు కళంకమని వ్యాఖ్యానించిన ఆయన, పోలీసులు చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించరాదని హితవు పలికారు.కొన్ని అగ్రవర్ణ పార్టీల నాయకులు వట్టె జానయ్య యాదవ్‌ను బెదిరించాలనే ఉద్దేశంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తోందని, ప్రజాభిమానంతో 5 నుండి 6 వార్డుల్లో ఘన విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

వట్టె జానయ్య యాదవ్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి అని పేర్కొంటూ, దాడులు చేసి పార్టీని వెనక్కి నెట్టలేరని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించబడిందని గుర్తుచేశారు. నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులు కొనసాగితే సహించబోమని హెచ్చరించారు.లోయల పాఠశాల ముందు జరిగిన ఘటనకు బాధ్యులైన ఎస్‌ఐ ఏడుకొండలు, సీఐ రాజశేఖర్‌లపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా అధ్యక్షురాలు కొన్నెమంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి మనోహర్, రంగన్న, వర్మ, గోపి, రంప శ్రీదేవి, తండు నాగలక్ష్మి, వాల్మీకి దీపమాల, కంటేకర్ రఘుమోహన్, నెలచర్ల మధు ప్రజాపతి, బోడపట్ల మధు, సురేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News