13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు
13వ వార్డులో అభివృద్ధి బ్రోచర్ విడుదల చేసిన పివి.శ్యాంసుందర్ రావు
Sthanikam District Staff Reporter
బీజేపీ రాష్ట్ర నాయకులు పివి.శ్యాంసుందర్ రావు
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో:జి.కె.శ్రీనివాస్(స్థానికం: జనవరి 04)
భారతీయ జనతా పార్టీ మాజీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర సీనియర్ నాయకులు పివి శ్యాంసుందర్ రావుని భాగ్యనగరంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.అంతరం వారు మాట్లాడుతూ...త్వరలో జరగబోయే భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని కోరారు.భువనగిరి పట్టణ ప్రజల మద్దతుతో నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భువనగిరి మొట్ట మొదటి మున్సిపల్ చైర్మన్ బిజెపి జెండా ఎగరవేయడం జరిగినది,అదే స్ఫూర్తితో...త్వరలో జరగబోయే పురపాలక సంఘం ఎన్నికల్లో సత్తా చాటాలని గతంలో పట్టణ వార్డుల అభివృద్ధికి చేసిన పనులను చెప్పి ప్రజలను మెప్పించి భారతీయ జనతా పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించుకోవాలని తనను కలిసిన నాయకులకు సలహాలు సూచనలు చేశారు. తదనంతరం13వ వార్డులో కౌన్సిలర్ కవిత నరసింహ చారి చేసిన అభివృద్ధిపై బ్రోచర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ,జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా,భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రత్నపురం బలరాం,బిజెపి సీనియర్ నాయకులు నీలం రమేష్,జనగామ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి