Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 AM

10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
March 09, 2026 08:58 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హౌసింగ్ బోర్డు 10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ,..."యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అంటే ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. ఈ ప్రాచీన భారతీయ సూక్తి స్త్రీ శక్తికి, ఆమెకు సమాజంలో ఇవ్వాల్సిన గౌరవానికి అద్దం పడుతుంది. మహిళలకు మర్యాద,గౌరవం ఇచ్చే కుటుంబం, సమాజం ఎల్లప్పుడూ ఆనందంగా,వృద్ధి చెందుతుందని దీని తాత్పర్యం. సనాతన ధర్మం లో స్త్రీలను ఆదిపరాశక్తి స్వరూపాలుగా భావిస్తారు,వారిని గౌరవించడం నిత్య పూజతో సమానం. సామాజిక ప్రాముఖ్యత మహిళలు గౌరవించబడని చోట ఎంత సత్కర్మ చేసినా ప్రయోజనం ఉండదని మన సంస్కృతి చెబుతోంది అన్నారు. మాతృమూర్తి గౌరవం అంటే స్త్రీలను పూజించడం అంటే వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం మరియు వారిని సమఉజ్జీలుగా చూడటం. సమాజంలో మహిళలకు ఉన్నత స్థానం ఇచ్చి, వారిని గౌరవించడం ద్వారానే నిజమైన పురోగతి,సంక్షేమం సాధ్యమవుతాయి అని అన్నారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బింగి నరేష్,వార్డు ముఖ్య మహిళా మణులు అందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కోర్ట్ రిటైర్డ్ సూపర్డెంట్ మాటూరి బాలేశ్వర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News