Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
March 09, 2026 08:58 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హౌసింగ్ బోర్డు 10వ వార్డ్ మునిసిపల్ కౌన్సిలర్ బింగి నరేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ,..."యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" అంటే ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువుంటారని అర్థం. ఈ ప్రాచీన భారతీయ సూక్తి స్త్రీ శక్తికి, ఆమెకు సమాజంలో ఇవ్వాల్సిన గౌరవానికి అద్దం పడుతుంది. మహిళలకు మర్యాద,గౌరవం ఇచ్చే కుటుంబం, సమాజం ఎల్లప్పుడూ ఆనందంగా,వృద్ధి చెందుతుందని దీని తాత్పర్యం. సనాతన ధర్మం లో స్త్రీలను ఆదిపరాశక్తి స్వరూపాలుగా భావిస్తారు,వారిని గౌరవించడం నిత్య పూజతో సమానం. సామాజిక ప్రాముఖ్యత మహిళలు గౌరవించబడని చోట ఎంత సత్కర్మ చేసినా ప్రయోజనం ఉండదని మన సంస్కృతి చెబుతోంది అన్నారు. మాతృమూర్తి గౌరవం అంటే స్త్రీలను పూజించడం అంటే వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం మరియు వారిని సమఉజ్జీలుగా చూడటం. సమాజంలో మహిళలకు ఉన్నత స్థానం ఇచ్చి, వారిని గౌరవించడం ద్వారానే నిజమైన పురోగతి,సంక్షేమం సాధ్యమవుతాయి అని అన్నారు.ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బింగి నరేష్,వార్డు ముఖ్య మహిళా మణులు అందరూ కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో కోర్ట్ రిటైర్డ్ సూపర్డెంట్ మాటూరి బాలేశ్వర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News