యశోద ఆస్పత్రిలో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
యశోద ఆస్పత్రిలో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి: సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్స్లో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ నిపుణుడు డాక్టర్. విక్రమ్ భైరి ఆధ్వర్యంలో ఈ చికిత్స జరిగింది.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సంకల్ప్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 78 ఏళ్ల రాజలక్ష్మి అనే మహిళకు రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు.
శస్త్రచికిత్స చేసిన రోజే సాయంత్రానికి ఆమె ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్లినట్లు చెప్పారు. ఈ శస్త్రచికిత్స జరిగి ఐదు నెలలు పూర్తయ్యాయని, ప్రస్తుతం ఆమెకు ఎలాంటి కాళ్ల లేదా కీళ్ల నొప్పులు లేకుండా మునుపటికంటే మెరుగ్గా నడవగలుగుతున్నారని వెల్లడించారు.
మోకాళ్ల నొప్పులతో బాధపడే రోగులకు శాతం మేర ఉపశమనం కలిగేలా చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామని డాక్టర్ విక్రమ్ భైరి తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ చేయించుకోవడం చాలా ముఖ్యమని, పాజిటివ్ మైండ్తో ఒత్తిడిని తగ్గించుకుంటే త్వరగా కోలుకునే అవకాశముందని సూచించారు.
శస్త్రచికిత్స చేయించుకున్న రాజలక్ష్మి మాట్లాడుతూ… మోకాళ్ల నొప్పుల వల్ల నడవడం కూడా కష్టంగా ఉండేదని, ప్రతి అడుగులోనూ తీవ్రమైన నొప్పి అనుభవించాల్సి వచ్చేదని తెలిపారు. యశోద ఆస్పత్రిలో డాక్టర్ విక్రమ్ భైరిని సంప్రదించి రోబోటిక్ శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎలాంటి నొప్పులు లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యశోద ఆస్పత్రి మార్కెటింగ్ జనరల్ మేనేజర్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ మేనేజర్ వెంకట్, ఎగ్జిక్యూటివ్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి