యాదాద్రి భువనగిరి జిల్లా టీ.ఎస్.జె.యు అధ్యక్షుడిగా సొల్లేటి గోవర్ధన చారి నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా టీ.ఎస్.జె.యు అధ్యక్షుడిగా సొల్లేటి గోవర్ధన చారి నియామకం
Sthanikam District Staff Reporter
భువనగిరి:తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జె.యు) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా సొల్లేటి గోవర్ధన చారినీ నియమించినట్లు టీఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా కొత్త ఆంజనేయులు,ఉపాధ్యక్షులుగా దిడ్డికాడి రాము,సంగిశెట్టి స్వామి దాస్,కోశాధికారిగా గుర్రం నరసింహ లను నియమించినట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు సొల్లేటి గోవర్ధన చారి మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం కృషి చేస్తానని,జిల్లాలో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడుతూ...టీ.ఎస్.జె.యు యూనియన్ను జిల్లాలో బలోపేతం చేస్తానన్నారు.తనను అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు నారాగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ లకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గా సొల్లేటి గోవర్ధన చారి నియామకం కావడంపై పలువురు జర్నలిస్టులు,నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి