PRINT TIME: April 18, 2026 08:14 PM
యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం
యాద ఋషి మండల దీక్ష సన్నిధానంలో మాలధారణ స్వాములకు అన్నదానం
April 18, 2026 06:43 PM
13 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాద ఋషి మండల దీక్ష సన్నిధానం వద్ద మాలధారణ స్వాములకు భక్తి శ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పేర బోయిన సత్యనారాయణ యాదవ్, బబ్బురి నరసింహ గౌడ్, గూడెం శ్రీను, సమ్మయ్య స్వామి, లింగంపల్లి మురళి స్వామి, లింగాల సురేష్, బోధన సురేందర్, చిత్రాల శీను, విజయ్, మీసాల జగదీష్, కందుకూరు వెంకటాచార్యులు, సంతోష్, సందీప్, నర్సింహ, నాగరాజు, మైసగౌడ్, బత్తిని బాల నరసింహ గౌడ్ తదితరులు సంయుక్తంగా నిర్వహించారు.
మండల దీక్షలో భాగంగా సన్నిధానానికి విచ్చేసిన మాలధారణ స్వాములకు ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం తమకు పుణ్యకార్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి