Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:26 PM

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు
15-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని కోరుతూ Communist Party of India (Marxist) ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలను ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.

సోమవారం నుంచి నిర్వహించనున్న నిరవధిక నిరాహార దీక్షల కోసం ఏర్పాటు చేసే శిబిర స్థలాన్ని మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ, మండల పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందించిన రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం దుర్భర పరిస్థితిలో ఉందని అన్నారు. కనీస సౌకర్యాలు లేక ఆసుపత్రి వెలవెలబోతుండడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. సరైన వైద్యం అందక ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని, దీంతో పేదలపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తగిన నిధులు కేటాయించి నూతన భవన నిర్మాణంతో పాటు వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలో అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

Sthanikam

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని కోరుతూ Communist Party of India (Marxist) ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలను ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.

సోమవారం నుంచి నిర్వహించనున్న నిరవధిక నిరాహార దీక్షల కోసం ఏర్పాటు చేసే శిబిర స్థలాన్ని మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ, మండల పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందించిన రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం దుర్భర పరిస్థితిలో ఉందని అన్నారు. కనీస సౌకర్యాలు లేక ఆసుపత్రి వెలవెలబోతుండడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. సరైన వైద్యం అందక ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని, దీంతో పేదలపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తగిన నిధులు కేటాయించి నూతన భవన నిర్మాణంతో పాటు వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలో అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News