Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:57 AM

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు

వంద పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్షలు రామన్నపేటలో సిపిఎం పిలుపు
March 15, 2026 04:17 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని కోరుతూ Communist Party of India (Marxist) ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలను ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు.

సోమవారం నుంచి నిర్వహించనున్న నిరవధిక నిరాహార దీక్షల కోసం ఏర్పాటు చేసే శిబిర స్థలాన్ని మండల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ, మండల పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా వైద్య సేవలు అందించిన రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం దుర్భర పరిస్థితిలో ఉందని అన్నారు. కనీస సౌకర్యాలు లేక ఆసుపత్రి వెలవెలబోతుండడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. సరైన వైద్యం అందక ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని, దీంతో పేదలపై ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తగిన నిధులు కేటాయించి నూతన భవన నిర్మాణంతో పాటు వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతో చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలో అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News