Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:56 AM

వాన బీభత్సం.. హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

వాన బీభత్సం.. హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్

 వాన బీభత్సం.. హైదరాబాద్–విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
May 26, 2026 11:46 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి 65 పూర్తిగా జలమయమైంది. రహదారిపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వర్షపు నీరు భారీగా రోడ్డుపై చేరడంతో వాహనాలు నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి కదలాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు.ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడగా, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వర్షపు నీరు రహదారులపైకి చేరి రాకపోకలకు అంతరాయం కలిగించింది. అధికారులు అప్రమత్తమై నీటి నిల్వ తొలగింపు చర్యలు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News