ప్రతి పెన్షన్ దారుడు ఆధార్ అప్డేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి:పులిమామిడి మమత రాజు
ప్రతి పెన్షన్ దారుడు ఆధార్ అప్డేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి:పులిమామిడి మమత రాజు
Krishna
సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ లబ్ధిదారుల ఆధార్ అప్డేషన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు విజయవంతంగా నిర్వహించారు. చేయూత పెన్షన్లు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పీఎంఆర్ గణేష్ మండపంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, వికలాంగులు, చేనేత కార్మికులు సహా అన్ని వర్గాల పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సులభంగా సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకుండా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పులిమామిడి మమత మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధి పూర్తిస్థాయిలో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆధార్ అప్డేషన్ కార్యక్రమం జూన్ 2 వరకు కొనసాగుతుందని, ఎవరైనా అప్డేట్ చేసుకోలేకపోతే తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే మళ్లీ వార్డు అధికారులను పిలిపించి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్ పథకాలను ప్రారంభించనున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రజలకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పులిమామిడి మమత రాజును వార్డు ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు ఆఫీసర్ బోడగామా రజనీకాంత్, చీలం సురేష్, పద్మమాణిక్యం, పరమదాసు, తాలెల్మ రాము, ఫయాజ్, ఫహీం, చోటు, నీలి శ్రీనివాస్, మేకల సంగన్న, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి