Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:31 PM

ప్రతి పెన్షన్ దారుడు ఆధార్ అప్డేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి:పులిమామిడి మమత రాజు

ప్రతి పెన్షన్ దారుడు ఆధార్ అప్డేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి:పులిమామిడి మమత రాజు

ప్రతి పెన్షన్ దారుడు ఆధార్ అప్డేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి:పులిమామిడి మమత రాజు
May 26, 2026 08:15 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ లబ్ధిదారుల ఆధార్ అప్డేషన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు విజయవంతంగా నిర్వహించారు. చేయూత పెన్షన్లు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పీఎంఆర్ గణేష్ మండపంలో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, వికలాంగులు, చేనేత కార్మికులు సహా అన్ని వర్గాల పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సులభంగా సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకుండా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పులిమామిడి మమత మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధి పూర్తిస్థాయిలో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆధార్ అప్డేషన్ కార్యక్రమం జూన్ 2 వరకు కొనసాగుతుందని, ఎవరైనా అప్డేట్ చేసుకోలేకపోతే తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే మళ్లీ వార్డు అధికారులను పిలిపించి సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పెన్షన్ పథకాలను ప్రారంభించనున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రజలకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పులిమామిడి మమత రాజును వార్డు ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు ఆఫీసర్ బోడగామా రజనీకాంత్, చీలం సురేష్, పద్మమాణిక్యం, పరమదాసు, తాలెల్మ రాము, ఫయాజ్, ఫహీం, చోటు, నీలి శ్రీనివాస్, మేకల సంగన్న, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News