Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:52 AM

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్
26-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : ఆదోని పట్టణంలో ముందస్తు అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని డీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు. పాంప్లెట్లు, ఫ్లెక్సీల ద్వారా విద్యార్థులను ఆకర్షిస్తూ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో రాయితీలు ఇస్తామని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

పట్టణంలో ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు, ఆర్‌ఐఓ స్పందించకపోవడం విచారకరమన్నారు. అక్రమ ఫీజులను అరికట్టి, ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై విచారణ జరిపి విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ నాయకులు వరుణ్‌రాజు, తిక్కస్వామి, కిరణ్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్

Article Image

ఆదోని, : ఆదోని పట్టణంలో ముందస్తు అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని డీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు. పాంప్లెట్లు, ఫ్లెక్సీల ద్వారా విద్యార్థులను ఆకర్షిస్తూ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో రాయితీలు ఇస్తామని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

పట్టణంలో ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు, ఆర్‌ఐఓ స్పందించకపోవడం విచారకరమన్నారు. అక్రమ ఫీజులను అరికట్టి, ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై విచారణ జరిపి విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ నాయకులు వరుణ్‌రాజు, తిక్కస్వామి, కిరణ్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News