Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్

ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్‌ఎఫ్
May 26, 2026 10:01 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : ఆదోని పట్టణంలో ముందస్తు అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని డీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు. పాంప్లెట్లు, ఫ్లెక్సీల ద్వారా విద్యార్థులను ఆకర్షిస్తూ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో రాయితీలు ఇస్తామని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

పట్టణంలో ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు, ఆర్‌ఐఓ స్పందించకపోవడం విచారకరమన్నారు. అక్రమ ఫీజులను అరికట్టి, ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై విచారణ జరిపి విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ నాయకులు వరుణ్‌రాజు, తిక్కస్వామి, కిరణ్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News