ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్ఎఫ్
ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి: డీఎస్ఎఫ్
Editor Desk
ఆదోని, : ఆదోని పట్టణంలో ముందస్తు అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులు, తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని డీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆరోపించింది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు చేపడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు. పాంప్లెట్లు, ఫ్లెక్సీల ద్వారా విద్యార్థులను ఆకర్షిస్తూ ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో రాయితీలు ఇస్తామని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
పట్టణంలో ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు, ఆర్ఐఓ స్పందించకపోవడం విచారకరమన్నారు. అక్రమ ఫీజులను అరికట్టి, ముందస్తు అడ్మిషన్ల దోపిడీపై విచారణ జరిపి విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ నాయకులు వరుణ్రాజు, తిక్కస్వామి, కిరణ్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి