PRINT TIME: July 14, 2026 01:52 PM
రాజకీయ వివక్షతో నిధులు నిలిపి వేయ వద్దు.. మాజీఎమ్మెల్యేబొల్లం
రాజకీయ వివక్షతో నిధులు నిలిపి వేయ వద్దు.. మాజీఎమ్మెల్యేబొల్లం
May 26, 2026 11:46 PM
12 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
కోదాడ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మద్దతు ఉన్న గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వివక్షతో నిధులు నిలిపివేస్తోందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆయన, పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి అత్యవసర బడ్జెట్ కేటాయించాలని కోరారు. నిధుల లేమితో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువల నిర్వహణ దెబ్బతింటోందని, ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్లపై రాజకీయ కక్షసాధింపు తగదని, అన్ని గ్రామాలను సమాన దృష్టితో చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి