నల్గొండ జిల్లా చిట్యాల మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. మధ్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపించగా, సాయంత్రానికి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై బలమైన గాలులు వీచాయి. అనంతరం పలుచోట్ల మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ప్రజలు మాత్రం ఈ వర్షంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడితో అల్లాడిపోయిన ప్రజలు చల్లని గాలులతో ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు, వర్షంతో పిల్లలు, యువకులు ఆనందంగా తడుస్తూ సందడి చేశారు. వాతావరణ మార్పుతో పట్టణం, గ్రామాల్లో చల్లని వాతావరణం నెలకొంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి