Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:14 PM

ఈదురు గాలులతో వర్షం.. చల్లబడిన వాతావరణం

ఈదురు గాలులతో వర్షం.. చల్లబడిన వాతావరణం

ఈదురు గాలులతో వర్షం.. చల్లబడిన  వాతావరణం
May 26, 2026 08:06 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. మధ్యాహ్నం వరకు భానుడు ప్రతాపం చూపించగా, సాయంత్రానికి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై బలమైన గాలులు వీచాయి. అనంతరం పలుచోట్ల మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.. కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ప్రజలు మాత్రం ఈ వర్షంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎండ వేడితో అల్లాడిపోయిన ప్రజలు చల్లని గాలులతో ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు, వర్షంతో పిల్లలు, యువకులు ఆనందంగా తడుస్తూ సందడి చేశారు. వాతావరణ మార్పుతో పట్టణం, గ్రామాల్లో చల్లని వాతావరణం నెలకొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News