Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:13 PM

ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ

ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ

ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ
May 26, 2026 08:59 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బక్రీద్‌ను శాంతి, సేవాభావంతో జరుపుకుందాం – ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దల పిలుపు

బక్రీద్ పండుగను పరస్పర గౌరవం, సేవాభావం, సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోవధకు దూరంగా ఉండాలని సూచిస్తూ సమాజంలో శాంతి, సోదరభావం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

“బక్రీద్ అంటే కేవలం ఖుర్బానీ మాత్రమే కాదు.. పేదలకు సహాయం చేయడం, పంచుకోవడం, మానవత్వాన్ని చాటడం అసలైన సందేశం” అని మత పెద్దలు స్పష్టం చేశారు. గోవధ పేరుతో కొన్ని ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, మతాల మధ్య చిచ్చుపెట్టే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు.

దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలంటే పరస్పర గౌరవ భావన అత్యంత అవసరమని పేర్కొంటూ, “నిజమైన దేశభక్తి అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇలాంటి వివాదాలకు పూర్తిగా తెరపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలకు యువత దూరంగా ఉండాలని సూచించిన మత పెద్దలు, బక్రీద్ పండుగను ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు, పేదలకు ఆహార పంపిణీతో శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన మౌలానా అత్తర్ సాబ్, హఫీజ్ ఖలీల్, మౌలానా మగ్దమ్ సాబ్, ముఫ్తీ సిద్ధిక్ అహ్మద్ షా సహాబ్ సంయుక్తంగా కీలక ప్రకటన విడుదల చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News