ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ
Komidala Mahender reddy
బక్రీద్ను శాంతి, సేవాభావంతో జరుపుకుందాం – ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దల పిలుపు
బక్రీద్ పండుగను పరస్పర గౌరవం, సేవాభావం, సామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోవధకు దూరంగా ఉండాలని సూచిస్తూ సమాజంలో శాంతి, సోదరభావం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
“బక్రీద్ అంటే కేవలం ఖుర్బానీ మాత్రమే కాదు.. పేదలకు సహాయం చేయడం, పంచుకోవడం, మానవత్వాన్ని చాటడం అసలైన సందేశం” అని మత పెద్దలు స్పష్టం చేశారు. గోవధ పేరుతో కొన్ని ప్రాంతాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ, మతాల మధ్య చిచ్చుపెట్టే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు.
దేశంలో సామరస్య వాతావరణం కొనసాగాలంటే పరస్పర గౌరవ భావన అత్యంత అవసరమని పేర్కొంటూ, “నిజమైన దేశభక్తి అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం” అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇలాంటి వివాదాలకు పూర్తిగా తెరపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలకు యువత దూరంగా ఉండాలని సూచించిన మత పెద్దలు, బక్రీద్ పండుగను ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు, పేదలకు ఆహార పంపిణీతో శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన మౌలానా అత్తర్ సాబ్, హఫీజ్ ఖలీల్, మౌలానా మగ్దమ్ సాబ్, ముఫ్తీ సిద్ధిక్ అహ్మద్ షా సహాబ్ సంయుక్తంగా కీలక ప్రకటన విడుదల చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి