Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:09 PM

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి

బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి
May 26, 2026 06:02 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* జలాల్‌పూర్‌లో ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు

* కిశోర బాలికలకు ‘స్నేహ సమ్మర్ క్యాంప్’లో అవగాహన

బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని జలాల్‌పూర్ గ్రామ సర్పంచ్ శాపాక లింగస్వామి, ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామ పంచాయితీ ఆవరణలో మంగళవారం "ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బాల్యవివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాల్యవివాహాల వల్ల బాలికల భవిష్యత్తు, ఆరోగ్యం దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతుందని తెలిసినా.. లేదా ఆ వివాహాన్ని ప్రోత్సహించినా, సహాయం చేసినా చట్టప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. వివాహం జరిపించే పురోహితుడికి, పెళ్ళికొడుకుకి, వారి తల్లిదండ్రులకు, అలాగే వారికి తోడుగా నిలిచే బంధువులకు కూడా ఈ శిక్ష వర్తిస్తుందని తల్లిదండ్రులకు, కిశోర బాలికలకు వారు క్షుణ్ణంగా వివరించారు.

కిశోర బాలికల ఆరోగ్యంపై ‘స్నేహ సమ్మర్ క్యాంప్’..

ఇదే వేదికపై నిర్వహించిన "స్నేహ సమ్మర్ క్యాంప్"లో బాలికల ఆరోగ్యంపై నిపుణులు అవగాహన కల్పించారు. ఏపీఎం, సీసీ మల్లేశం, వీబీకే రజిత పాల్గొని బాలికల్లో రక్తహీనత (అనీమియా) నివారణ, శరీరంలో హిమోగ్లోబిన్ శాతం ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు సవివరంగా తెలియజేశారు.

ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కేసారం మధుసూధన్ రెడ్డి, వార్డు సభ్యులు, సీహెచ్. మంగ, ఎస్. పద్మ, వీఓ కృష్ణవేణి, సంధ్య, అమృత, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు, కిశోర బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News