రూ.30 లక్షల లంచం డిమాండ్.. శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
రూ.30 లక్షల లంచం డిమాండ్.. శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
Editor Desk
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
శామీర్పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.
ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వెల్లడించారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎమ్మార్వో సుచరితతో పాటు కీసర ఆర్డీవో రాజేష్, పలువురు సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, 2024లో కూడా శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ డ్రైవర్తో కలిసి రూ.2 లక్షల లంచం కేసులో ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి