Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:15 AM

వివక్ష చేస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ కళ్యాణ్

వివక్ష చేస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ కళ్యాణ్

వివక్ష చేస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ కళ్యాణ్
March 31, 2026 09:10 PM 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: కులం పేరుతో దూషించడం, వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ తహశీల్దార్ కళ్యాణ్ హెచ్చరించారు.

మంగళవారం భువనగిరి మండలం వీరవెళ్ళి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు కులం పేరుతో వివక్ష చూపుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం కులం పేరుతో దూషించినా, వివక్ష చూపినా కేసులు నమోదు చేసి జైలు శిక్ష, జరిమానా విధిస్తారని తెలిపారు.

గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డివిఎంసి సభ్యుడు బర్రె సుదర్శన్, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News