PRINT TIME: May 27, 2026 01:15 AM
వివక్ష చేస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ కళ్యాణ్
వివక్ష చేస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ కళ్యాణ్
March 31, 2026 09:10 PM
48 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి: కులం పేరుతో దూషించడం, వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ తహశీల్దార్ కళ్యాణ్ హెచ్చరించారు.
మంగళవారం భువనగిరి మండలం వీరవెళ్ళి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు కులం పేరుతో వివక్ష చూపుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం కులం పేరుతో దూషించినా, వివక్ష చూపినా కేసులు నమోదు చేసి జైలు శిక్ష, జరిమానా విధిస్తారని తెలిపారు.
గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డివిఎంసి సభ్యుడు బర్రె సుదర్శన్, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి