Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “కల్తీకి చెక్… రాష్ట్రంలో కొత్త నియంత్రణ యంత్రాంగం” “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” ఇరాన్‌పై యుద్ధం ఆపాలి: హైదరాబాద్‌లో వామపక్షాల భారీ యుద్ధవ్యతిరేక ర్యాలీ అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 31, 2026 11:04 PM

వివక్ష చేస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ కళ్యాణ్

వివక్ష చేస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ కళ్యాణ్

వివక్ష చేస్తే చర్యలు తప్పవు: తహశీల్దార్ కళ్యాణ్
March 31, 2026 09:10 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: కులం పేరుతో దూషించడం, వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ తహశీల్దార్ కళ్యాణ్ హెచ్చరించారు.

మంగళవారం భువనగిరి మండలం వీరవెళ్ళి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు కులం పేరుతో వివక్ష చూపుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం కులం పేరుతో దూషించినా, వివక్ష చూపినా కేసులు నమోదు చేసి జైలు శిక్ష, జరిమానా విధిస్తారని తెలిపారు.

గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డివిఎంసి సభ్యుడు బర్రె సుదర్శన్, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News