విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి........
విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి........
Harish K
విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి........
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం సంఘ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ముందుగా కోదాడ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ ఎర్నెని కుసుమ, వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ మల్లిశ్వరి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్యలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ రాజ్యాంగాన్ని రాసిన మహానీయులు అని అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షులు జానయ్య, ఉపాధ్యక్షులు గులాం యాజ్దని, భ్రమరాంబ, భూపాల్ రెడ్డి, హాజీ నాయక్,బాలేమియా,బిక్షం, పొట్ట జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు......

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి